Cancer: ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరానికి లక్షలాది మంది క్యాన్సర్ Cancer బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారట. మన శరీరంలో ప్రధానంగా క్యాన్సర్ వచ్చే ప్రదేశాలు గర్భాశయం, నోరు, గొంతు అలాగే రొమ్ము. ప్రస్తుతం అన్ని రకాల క్యాన్సర్స్ లో థైరాయిడ్ క్యాన్సర్ బాగా విస్తరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ థైరాయిడ్ కాన్సర్ గొంతు ప్రదేశంలో వస్తుందట. ఈ మధ్యకాలం లో ఈ థైరాయిడ్ క్యాన్సర్ భారీన పడ్డ భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగిందట. గత 35 ఏళ్ల తో పోలిస్తే ప్రస్తుతం దీని ప్రభావం మూడు రెట్లు ఎక్కువగా ఉందని అనేక అధ్యయనాల్లో తేలింది.
ఈ థైరాయిడ్ క్యాన్సర్ పురుషుల కంటే ఎక్కువగా మహిళల్లో కనిపించడానికి వెనుక అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో అయోడిన్ శాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల తరచు తీసుకోవడం, శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వంటివి థైరాయిడ్ క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలని వైద్యులు చెబుతున్నారు.
ఈ క్యాన్సర్ మన శరీరంలో ఉంటే,
మెడపై ఎటువంటి నొప్పిలేకుండా ఒక ముద్దలాగా గడ్డ ఏర్పడుతుందట.
గొంతులో ఏ కారణం లేకుండానే వాపు వస్తుందట.
ఆహారం మింగడానికి గొంతులో ఇబ్బంది ఏర్పడుతుందట.
థైరాయిడ్ క్యాన్సర్ భారీన పడ్డ వ్యక్తికి శస్త్రచికిత్స చేసి థైరాయిడ్ గ్రంథిని తొలగించడం మాత్రమే ఏకైక పరిష్కారమని డాక్టర్లు స్పష్టం చేసారు. ముందుగా గుర్తించడం ద్వారా ఈ థైరాయిడ్ క్యాన్సర్ ప్రమాదం నుంచి త్వరగా బయటపడొచ్చట. అయితే, ఈ థైరాయిడ్ క్యాన్సర్ కి వీలైనంత దూరం గా ఉండాలంటే మీకు అనుమానం రాగానే వెంటనే డాక్టర్ ని సంప్రదించి వారి సూచన మేరకు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.