ఉద్దానం అంటే పరిచయం అవసరం లేని ఊరి పేరు!ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఈ ఊరి పేరు అందరికీ ఎలా తెలుసంటే అక్కడ నెలకొన్న ప్రాణాంతక సమస్యే కారణం!
పండు ముసలి నుంచి చిన్నారులు వరకూ కిడ్నీ వ్యాధి బారిన పడి అర్ధాంతరంగా తనువు చాలిస్తున్న ప్రాంతం అది. అక్కడ దొరికే నీళ్లు తాగితే చాలు కిడ్నీ వ్యాధి వచ్చేస్తుంది. దశాబ్దాల తరబడి ఈ సమస్య నెలకొని ఉన్నా దాన్ని వెలుగులోకి తెచ్చింది మాత్రం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అని చెప్పడం సమంజసం. వెంటనే అప్పటి పవన్కళ్యాణ్ మిత్రుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యథాప్రకారం స్పందించారు. ఉద్దాన౦ సమస్యను తీర్చేసి అక్కడి ప్రజలను ఉద్ధరిస్తానని ఆయన హామీలు గుప్పించారు.
కానీ చంద్రబాబు చేసింది శూన్యం.యథాతథంగా ఉన్న ఆ సమస్య నూతన ముఖ్యమంత్రి జగన్ దృష్టికి రాగానే ఆయన దీని పరిష్కారానికి ప్రణాళిక సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.యుద్ధ ప్రాతిపదిక మీద అధికారులు ఆ ప్రాంతానికి అవసరమైన మంచినీటి పథకాన్ని సిద్ధం చేశారు.ఇందులో భాగంగా దాదాపుగా 700 కోట్ల రూపాయలతో భారీ ప్రాజెక్ట్ కి జగన్ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. హీరమండలం రిజర్వాయర్ నుంచి భూగర్భ పైపు లైనుల ద్వారా ఉద్ధానానికి మంచినీరు తీసుకువచ్చే పధకానికి జగన్ త్వరలోనే శ్రీకారం చుట్టనున్నారని సమాచారం. అలా తెచ్చిన నీటిని గ్రామాల్లో రక్షిత మంచి నీటి పధకం ద్వారా ప్రజలకు అందచేస్తారు.
దాంతో ప్రజలకు భూగర్భ జలాలను చేదుకుని నీరు తాగే దురవస్థ తప్పుతుంది. దాంతో పాటే విషాన్ని మింగి కిడ్నీ వ్యాధుల బారిన పడి చనిపోవడాలు అసలు ఉండవు. దాదాపు ఆరు లక్షల మంది ప్రజానీకానికి ఉపయోగపడే ఈ ఉద్ధానం ప్రాజెక్ట్ అమల్లోకి వస్తే అంతకు మించిన విజయం జగన్ ప్రభుత్వానికి ఇంకొకటి ఉండదు
ఉద్ధానం ఈనాటి సమస్య కాదు, అది చిరకాలం నుంచి ఉన్నది. అటువటి సమస్యను కనుక జగన్ పరిష్కరిస్తే మాత్రం ఆయన జనం గుండెల్లో దేవుడే అవుతారు. ఆ ప్రాంతంలో ప్రతి ప్రతి ఇంటి గోడ మీద జగన్ ఫోటో వేలాడుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.