స్త్రీ ,పురుషులకు మెంతి కూర ఎలా కూడాఉపయోగపడుతుందో తెలుసుకుందాం.చలి కాలంలో షుగర్ను అదుపులో ఉంచుకోవడం కొంత కష్టమవుతుంది. మెంతి కూరలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మధుమేహం మాయమవుతుంది. ఒక టీస్పూన్ మెంతులు తీసుకుని, పౌడర్ గా చేసుకుని, గోరువెచ్చని నీటిలో కలుపుకుని రోజుకు రెండుసార్లు తాగితే డయాబెటిస్ దూరం అవుతుంది.
మెంతి కూర వలన స్త్రీలకు ఎంతగానో మేలు జరుగుతుంది. మెంతికూర తినడం వల్ల స్త్రీలలో వచ్చే నడుము నొప్పి నుండి చక్కని ఉపశమనంకలుగుతుంది. నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పిని కూడా మాయం చేస్తుంది. అంతేకాదు ఆడవారిలో మగవారిలోను లైంగిక సమర్థతను పెరిగేలా చేస్తుంది.
మెంతులలో పీచు పదార్ధం , ఐరన్ పుష్కలం గా లభిస్తుంది. దీంతోపాటు విటమిన్-సి, బి1, బి2, కాల్షియం కూడాలభిస్తాయి .మెంతి ఆకులను ఎండబెట్టుకుని కూడా కొన్ని ఆహార పదార్ధాలలోవాడుకోవచ్చు . ఈ ఆకులూ ఎండినవి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
మెంతి ఆకులను తినడం వల్ల రక్తం లో ఉండే కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంటుంది. చలి కాలంలో సహజంగానే ఎదురయ్యే చర్మ సమస్యలు కూడా తగ్గిపోతాయి. చర్మం మృదువుగా, తేజోవంతం గా మారుతుంది. మెంతి ఆకుల్లో క్యాలరీలు తక్కువగా ఉండడం వలన బరువు బాగా తగ్గవచ్చు. అంతే కాదు వీటితో రక్త హీనతను కూడా దూరం అవుతుంది. మెంతికూర తో కడుపు ఉబ్బరం , కడుపులో మంట తగ్గుతాయి.
శరీరానికి నీరుపట్టినవారు మెంతికూరను రోజూఆహారం లో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందిఅని ఆయుర్వేద నిపుణులు తెలియ చేస్తున్నారు.మెంతి ఆకులుఆరోగ్యానికే కాదు అందానికి కూడా బాగా ఉపయోగపడతాయి. మెంతికూరను పేస్ట్ లాగా చేసుకుని తలకు పట్టించి ఒక అరగంట ఆరిన తర్వాత తల స్నానం చేయడం వల్ల మృదువైన కేశాలుపొందవచ్చు .