Tips : మనిషి లేచింది మొదలు ఎన్నో అవసర ఉంటాయి.. జీవితం ముందుకు సాగడానికి ఎన్నో ప్రయత్నాలు చేయవలిసి ఉంటుంది. చేసే ఈ ప్రయత్నాలతో పాటు దేవుడి అనుగ్రహం కూడా ఉంటే ఇంకా త్వరగా విజయ వంతం గా పనులు పూర్తవుతాయి. కాబట్టి మీరు చేసే ప్రయత్నాలను బట్టి ఈ స్తోత్రాలను చదువుకోండి. కుటుంబం లో ఉండే వ్యక్తుల మధ్య మంచి బంధాలు కొనడం కోసం విష్ణు సహస్రనామం తో పాటు లలితా సహస్ర నామం పారాయణ చేసుకోవాలి.
ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసుకునే వారు మంచి అవకాశాలు రావడం కోసం చేసే ప్రయత్నాలు ముందుకు వెళ్ళాలి అంటే మాత్రం ,రోజూ సూర్యాష్టకం చేసుకోవడం తో పాటు , ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవాలి. దాని తో పాటు సూర్యధ్యానం కూడా చేసుకోవాలి.
వ్యాపార ప్రయత్నాలు చేసుకోవాలి అనుకునేవారు
“కనకధారా స్తోత్రం” రోజు పారాయణం చేసుకుంటే మీరు చేయబోయే వ్యాపారం
అభివృద్ధి లో కి వస్తుంది.
చక్కని విద్య కోసం ,
చదువులో విజయం పొందడానికి ప్రతి రోజూ
హయగ్రీవ స్తోత్రం పిల్లలతో చదివించాలి.
దానితో పాటు “సరస్వతి ద్వాదశ నామాలు కూడా చదువుకునే విధం గా చేయాలి.
ఇక వివాహం కావాలి అని కోరుకునే వారు లక్ష్మీ అష్టోత్తర పారాయణం చేసుకోవాలి
మంచి సంబంధం కుదిరి ,పనులన్నీ చక్కగా జరగాలని,
పెళ్లి తంతు ఏ ఆటంకం లేకుండా జరగాలని సంకల్పం చేసుకుని
ప్రతి రోజు ఈ పారాయణాన్నీ చేసుకుంటే ఆ కోరికలు అన్ని తీరుతాయట.
పిల్లలు పుట్టాలని కోరుకునే వారు
ప్రతి రోజు గోపాల స్తోత్రం చదువుకుంటే మంచిది.
దానితో పాటు గర్భవతిగా వున్న స్త్రీ ఈ స్తోత్రాన్ని రోజు చదవడం వలన సుఖప్రసవం జరుగుతుంది అని చెబుతారు పెద్దలు.
అప్పులు ఇబ్బంది పెడుతుంటే కనుక
ప్రతి రోజూ నవగ్రహ స్తోత్రం చదువుకుంటూ ఉంటే
ఆ రుణ బాధలనుండి విముక్తి పొందుతారు.
ఏ కోరికలు తీరాలన్న కూడా ప్రతి రోజు
విష్ణు సహస్ర నామ పారాయణ చేసుకుంటే
కోరిన కోరికలు నెరవేరుతాయి.