Dull duel : ధర్మబద్ధమైన కార్యక్రమాల్లో విజయం సాధించడానికి
శ్రీరామపట్టాభిషేకం చిత్రపటం ముందు నిలబడి ప్రతి రోజూ శ్రీరామ జయరామ జయజయ రామ అనే శ్రీరామ జయమంత్రాన్ని 108సార్లు జపం చేస్తూ, రామరక్షాస్తోత్రం చదవాలి.
కొబ్బరినూనెతో దీపం
కొబ్బరినూనెతో దేవుని ఎదుట దీపాలు వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం.
ప్రతి రోజూ శ్రీమహాలక్ష్మీదేవి ఎదుట కొబ్బరినూనెతో దీపం వెలిగించి, పంచదార, కొబ్బరి కలిపి నైవేద్యంగా నివేదిస్తే ఇంట జరిగే ఎలాంటి శుభకార్యాలు అయినా నిర్విఘ్నంగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా శుభప్రదంగా పూర్తి అవుతాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు.
కులదేవత ముందు కొబ్బరినూనెతో అఖండదీపం పెట్టడం వలన ఇంట్లో సిరిసంపదలు వృద్ధి చెందుతాయి.
పూర్ణాహుతి సమయంలో
ఏ ఇంట ప్రతిరోజూ దేవిదేవతల ముందు కొబ్బరినూనెతో దీపాలను వెలిగిస్తారో ఆ ఇంట్లో శుభకార్యాలు వేగం గా దిగ్విజయంగా జరిగిపోతాయి.
ఎటువంటి హోమాలలో అయినా కూడా పూర్ణాహుతి సమయంలో పట్టువస్త్రాన్ని కొబ్బరినూనెతో తడిపి హోమగుండంలో వేస్తె అష్టనిధి, నవనిధులు సమకూరుతాయి అనేది నిజం.
48 రోజులు పాటు శ్రీ మహాలక్ష్మీదేవిని ఈశాన్యంలో ప్రతిష్టించి.. కొబ్బరి నూనెతో దీపాలను పెట్టడం వలన రావలసిన ఎంతటి మొండి బాకీలు అయినా వసూలు అవడం తో పాటు .. ఇంట్లో శుభకార్యాలు నిర్విఘ్నంగా జరుగుతాయి.
శ్రీ వేంకటేశ్వరస్వామి ఎదట
శ్రీ వేంకటేశ్వరస్వామి ఎదుట కొబ్బరినూనెతో దీపాలు పెట్టి, శ్రీ వేంకటేశ్వర వజ్రకవచం చదివి పాలు,పళ్ళు , అటుకులు, బెల్లం, నైవేద్యంగా పెడితే రావలసిన మొండి బాకీలు చాలా త్వరగా వసూలు అవుతాయిశ్రీ వేంకటేశ్వరస్వామి ఎదట ప్రతి శనివారం కొబ్బరినూనెతో దీపాలను పెట్టి , పూజించి, తులసిదళం కానీ కానీ తులసి దళం మాలను వేస్తె ఆర్ధిక సమస్యలు ఉండవు, వివాహం మంగళకరంగా జరుగుతుంది.