మంచి ఎవరు చేసినా పాటించటం ప్రజాప్రతినిధుల ధర్మం.కరోనా కష్టకాలంలో పస్తులు ఉంటున్నవారు ఎందరో ఉన్నారు. అలాంటి వారికి ఆహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి ఆ పని చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ జగన్ కూడా ఈ తరహా లో ఆపన్నులకు ఆహారం అందిస్తే ఎందరో మేలు పొందుతారు.
లాక్ డౌన్ నేపద్యంలో వృద్ధులు,అనారోగ్యంతో బాధపడుతున్న వారు,నిరాశ్రయులుఆహారం దొరికక బాధపడుతున్నారని తెలుసుకున్న తమిళనాడు సీఎం పళని స్వామి ఓ చక్కటి యోజనకి శ్రీకారం చుట్టారు. అలా బాధపడుతున్నవారికి ఉచితంగా ఆహారాన్ని అందించేటట్టు అది కూడా వారు ఉన్న చోటికి లేదా వారి ఇళ్లకు డెలివరీ అందించేందుకు సీఎం సన్నాహాలు చేస్తున్నాడు.
ఏ ఒక్కరూ ఆకలితో అలమటించొద్దు అనే ఆశయంతో ముందుకు సాగుతున్నారు. సీఎం ఆదేశాలతో చెన్నైతో పాటు చెంగెల్పేట్, కాంచీపురం, తిరువల్లూరు ప్రాంతాలలో అమ్మ క్యాంటీన్లు కొనసాగుతాయన్నారు. కిచెన్ వసతులను మరింత మెరుగు చేయాలని సామర్ధత పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.మన తెలుగు ముఖ్యమంత్రులు కూడా పళని స్వామి మార్గంలో నడుస్తారని ఆశిద్దాం