Nagarjuna: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున – ఆయన తనయుడు అక్కినేని నాగ చైతన్య కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ బంగార్రాజు. 2019లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా లాంటి భారీ హిట్ సినిమా తరహాలోనే ఈ సినిమా కథ, కథనం సాగనున్నాయి. అందరూ ఆ సినిమాకు సీక్వెలో..ప్రీక్వెలో అని చెప్పుకుంటున్నారు. కానీ బంగార్రాజు ..పూర్తిగా కొత్త కథతో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ రూపొందిస్తున్నాడు. ఇది అక్కినేని మల్టీస్టారర్గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగ్ సరసన రమ్యకృష్ణ, చైతు సరసన ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్స్గా నటిస్తున్నారు.
గత రెండేళ్ళుగా ఈ సినిమా గురించి రక రకాల ప్రచారాలు సోషల్ మీడియాలో వచ్చి వైరల్ అయ్యాయి. కొన్ని సందర్భాలలో ఈ సినిమా క్యాన్సిల్ అయిందనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఎట్టకేలకి నాగార్జున బంగార్రాజు చిత్రాన్ని మొదలు పెట్టడమూ చక చకా పూర్తి చేస్తుండటమూ జరుగుతున్నాయి. మెజారిటీ భాగం టాకీపార్ట్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే నాగా చైతన్య, నాగార్జున, కృతిశెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా రిలీజై మంచి అంచనాలను పెంచాయి. ఇక ఈ సినిమాలో నాగార్జున – నాగ చైతన్య తాతా – మనవడుగా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.
Nagarjuna: 50 కోట్లు అనేది పెద్ద బడ్జెట్ కాదని చెప్పుకుంటున్నారు.
అయితే, ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్కు సంబంధించిన ఓ లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముందు అనుకున్న బడ్జెట్ కంటే ఇప్పుడు బాగా పెరిగినట్టు సమాచారం. అనపూర్ణ స్టూడియోస్ – జీ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నాయి. మెజారిటీ బడ్జెట్ జీ వారే కేటాయించినట్టు తెలుస్తోంది. ఇక సినిమా మొత్తం పూర్తైయ్యే సరికి 50 కోట్లకు పైగానే బడ్జెట్ అయ్యేలా ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ రేంజ్ బడ్జెట్ అంటే అటు నాగార్జున- ఇటు నాగ చైతన్యల కెరీర్లో ఫస్ట్ టైమ్ అంటున్నారు. అయితే బడ్జెట్ ఎంతైనా సెట్స్ పరంగా, సినిమాటోగ్రఫీ పరంగా ఆ రిచ్నెస్ సినిమాలో కనిపిస్తుందని ఇది మల్టీస్టారర్ కాబట్టి 50 కోట్లు అనేది పెద్ద బడ్జెట్ కాదని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఈ అక్కినేని మల్టీస్టారర్ ఏమేరకు ఆకట్టుకుంటుందో.