విశాఖకు ఒక బోస్టన్ ఎమ్మెన్సీ కంపెనీ వచ్చిందంటూ రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైసిపి తెగ పోస్టింగులు పెడుతోంది.
తీరా చూస్తే ఇప్పుడు విశాఖకు వచ్చిన బోస్టన్ కంపెనీ అమెరికా నుంచి కాకుండా.. కూకట్పల్లి నుంచి వచ్చిందనే విషయం బయటపడింది. ఇంకా వివరంగా చెప్పాలంటే విశాఖ కు వచ్చింది “బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ( బి.సి.జి)” కాదు.కూకట్ పల్లి కి చెందిన ది బోస్టన్ గ్రూప్ “ విశాఖలో బ్రాంచ్ పెట్టడానికి ముందుకు వచ్చింది. దీన్నే బోస్టన్ అని వైసీపీ శ్రేణులు బూస్ట్ చేశాయి.విశాఖలో కానీ ఆ బోస్టన్ ఈ బోస్టన్ వేరువేరని చాలా మందికి తెలియదు.నిజానికి బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ మామూలుది కాదు. మల్టినేషనల్ కంపెనీనే.పైగా 3 రాజధానుల స్క్రిప్టు ఆ కంపెనీ రచించింది. దీంతో జగన్ ప్రభుత్వం కృషి వల్ల ఆ బోస్టన్ కన్సల్టెన్సీ విశాఖ వచ్చిందని అందరూ భావించారు.కానీ.. అది బోస్టన్ కాదని.. బోస్టన్ లాంటిదని తెలియడానికి ఎన్నో గంటలు పట్టలేదు.
విశాఖ వస్తున్న బోస్టన్ వివరాల్లోకి వెళితే …ఈ బోస్టన్ గ్రూప్ అడ్డా.. కూకట్పల్లిలో ఓ ఫ్లాట్..! కూకట్ పల్లి ఫిఫ్త్ ఫేజ్లో కనకదుర్గ మ్యాన్షన్ అనే భవనం దగ్గరకు వెళ్తే.. “ది బోస్టన్ గ్రూప్” అనే బోర్డు కనబడుతుంది. అది దాదాపుగా నిర్మానుష్యంగాఉంటుంది. మల్టీ నేషనల్ కంపెనీ లుక్ కాదు కదా… సాధారణ రియల్ ఎస్టేట్ కంపెనీ లుక్ కూడా ఉందు. ఎవరైనా వస్తే కూర్చోవడానికి చిన్న చిన్న ప్లాస్టిక్ టేబుల్ ఉంటాయి. ఈ ఈ కంపెనీ ఏం చేస్తుందంటే పెద్ద లిస్టు ఉంటుంది కానీ అది అవన్ని చేస్తుందని అర్థం కాదు.
ఈ కంపెనీ ఉద్యోగులు కేవలం 36 మంది అంటే దాన్ని బట్టే అది ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. ఏ కంపెనీ ఆదాయం సంవత్సరానికి ఆరు కోట్ల రూపాయల లోపే..! అన్నిటికీ మించి ఈ కంపెనీ అధినేత సుబ్బు గూఢచర్యం కేసులో అరెస్టయిన ఘనుడు.ఆయనపై అమెరికాలో చాలా కేసులున్నాయి. అవి చిన్న చిన్న మోసాలవి కాదు. గూఢచర్యం చేస్తూ.. రహస్యాలు అమ్ముతున్న కేసులు. 1996లో రష్యా గూఢచారిగా కలరింగ్ ఇస్తూ.. అమెరికన్ గూఢచార సంస్థ ఎఫ్బీఐకి కొంత మెటీరియల్ అమ్మి దొరికిపోయి దోషిగా తేలాడు.
అతనితో ఒప్పందాలు చేసుకున్న గూఢచారుల్ని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు కూడా. ఇలాంటి కంపెనీతో జగన్ ప్రభుత్వం చీప్ కంపెనీతో నేర చరిత్ర ఉన్న వ్యక్తితో జగన్ ప్రభుత్వం ఎంఓయూ చేసుకోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.దీంతో సీఎం జగన్ కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది.