స్టార్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన నటుడు ఆది పినిశెట్టి. విలక్షణ పాత్రలతో బహు భాషా నటుడిగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే అటు తమిళ సినిమాలూ చేస్తూ మంచి గుర్తింపు పొందాడు. ప్రముఖ దర్శకుడు తేజ డైరెక్షన్ లో వచ్చిన ‘ఒక విచిత్రం’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆది పినిశెట్టి.. టాలీవుడ్ లో త్వరగానే అవకాశాలు అందుకున్నాడు. ముఖ్యంగా తమిళంలో నటించిన కొన్ని సినిమాలు మంచి గుర్తింపును ఇచ్చాయి.
టాలీవుడ్ లో గుండెల్లో గోదారి సినిమా ఆది కి చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ప్రేక్షకులు అనుకున్నంత స్పీడ్గా సినిమాలను చేయలేకపోయాడు. అలా చాలా గ్యాప్ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘సరైనోడు’ సినిమాలో విలన్ గా నటించాడు. ఈ సినిమా తో వచ్చిన పాపులారిటీ తోనే తర్వాత పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమాలో కూడా ప్రతినాయకుడిగా నటించి ఆకట్టుకున్నాడు. ఇక నానితో కలిసి ‘నిన్నుకోరి’ తన సోదరుడి దర్శకత్వంలో ‘మలుపు’ సినిమాలలో నటించి సక్సెస్ అందుకున్నాడు. అంతే కాకుండా ‘నీవెవరో’ ‘యూ టర్న్’ సినిమాలతో పాటు రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ మూవీలో కీలక పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇలా వరుస సినిమాలతో ఆది పినిశెట్టి, హీరో కమ్ విలన్ గా నిలదొక్కుకున్నాడు. చెప్పాలంటే ఆది లో మంచి హీరో అయ్యే టాలెంట్ ఉంది. కాని ఎక్కువగా ఆ ప్రయత్నాలు చేయడం లేదన్న టాక్ వినిపిస్తోంది. అటు తెలుగు ఇటు తమిళం లో ఎంతో కష్టపడి సాధించుకున్న ఇమేజ్ ఇంతలా గ్యాప్ ఇస్తే తగ్గిపోతుందన్న బాధ ఆది అభిమానుల్లో కలుగుతుందట. ఏది ఏమైనా ఇప్పుడిప్పుడే చిత్రపరిశ్రమలో తనకంటూ ఇమేజ్ వస్తున్న సమయంలో ఆది పినిశెట్టి ఇలా సినిమాలు బాగా డిలే చేయడం ఎంతమాత్రం కరెక్ట్ కాదు అని అనుకుంటున్నారట. మరి నెక్స్ట్ సినిమాలు ఏంటన్నది క్లారిటీ లేదు. ఆ లాంటి మరో నటుడు సత్యదేవ్ ఈ మధ్య బాగా పాపులర్ అవుతున్నాడు.