చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు డ్వాక్రా మహిళలను టిడిపి కార్యకర్తలుగా వాడుకునే వారని ప్రతీతి. 2004 ఎన్నికల్లో ఒంగోలులో విజయభారతి అనే డ్వాక్రా లీడర్ కు టిడిపి టిక్కెట్టు కూడా ఇచ్చిన ఘనత ఆయనది.
అది చంద్రబాబు రాజకీయం అనుకుందాం.ఇప్పుడు వైసిపి వారు కూడా అదే పనిచేస్తున్నారు .కాకుంటే వీళ్లు వాలంటీర్లను పార్టీ క్యాడర్ గా ఉపయోగించుకుంటున్నారు.వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల వ్యవస్థ ఆవిర్భవించిన విషయం తెలిసిందే.‘మన పార్టీ కార్యకర్తలకే వాలంటీర్ పోస్టులు ఇచ్చుకున్నాం..’ అని ఓ సందర్భంలో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి నోరు జారేశారు. . అలాంటి విజయసాయి ఆ మాట చెప్పారంటే వాలంటీర్ల పేరుతో వైసీపీ చేస్తున్న రాజకీయాలేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
సరే ఇది గతం అనుకుంటే తాజాగా వైసీపీ నాయకుడు ఒకరు వాలంటీర్ల ఉద్దేశించి చేసిన ఒక కామెంటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది‘2024 ఎన్నికల్లో నారా లోకేష మీద వాలంటీర్ని పోటీకి నిలబెట్టి గెలిపిస్తాం..’ అంటూ ఆ వైసీపీ నేత వ్యాఖ్యానించడం జరిగింది.ఇది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ తెరలేపి౦ది.వెంటనే టిడిపి రంగంలో దిగింది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు దీనిపై తీవ్రంగా స్పందించారు.
మీ పార్టీలో చేర్చుకున్న ముగ్గురు టిడిపి ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఆయా స్థానాల్లో వాలంటీర్లను పోటీ పెట్టి గెల్పించుకోండి అంటూ ఆయన ట్వీట్ చేశాడు.మరోవైపు ‘వాలంటీర్లంటే వైసీపీ కార్యకర్తలేననడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?’ అని నెటిజన్లు వైసీపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. నారా లోకేష్ ను ఓడించటానికి వాలంటీర్ చాలు అన్నది ఆ వైసిపి నేత ఉద్దేశ్యం కావచ్చు. కానీ, మేటర్ ఇంకోలా మలుపు తిరిగింది . ఏదేమైనా ఒక రాజకీయ నాయకుడు వొదిలే మాటలు తూటాలా పేలే రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉన్నాయి .ఎవరైనా సరే మాటలను పొదుపుగా వాడడం అవసరమని రాజకీయ పరిశీలకులు సలహా ఇస్తున్నారు.