Indian Flag: రష్యా – ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో భారత దేశ గౌరవం మరో సారి ఇతర దేశాలకు మరో సారి తెలిసి వచ్చింది. ఇతర దేశాలతో భారతదేశం నెరుపుతున్న స్నేహం, దౌత్య సంబంధాల కారణంగా ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఉక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధం జరుగుతున్నా ఈ రెండు దేశాలతో భారతదేశానికి విరోధం లేదు. అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ తోనే భారత్ స్నేహసంబంధాలనే కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ విజ్ఞప్తి మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడతో ఫోన్ లో మాట్లాడి శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఇదే క్రమంలో ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత పౌరులు, విద్యార్ధులను తరలించేందుకు సహకరించాలని కూడా మోడీ విజ్ఞప్తి చేశారు.
Indian Flag: ఉక్రెయిన్ నుండి సరిహద్దు దేశాలకు జాతీయ జెండాతో..
ఇప్పుడు ఈ విషయం అంతా ఎందుకు అంటే.. ఉక్రెయిన్ లో వార్ నేపథ్యంలో ఆ దేశ గనగతలాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత విద్యార్ధులను సరిహద్దు దేశాలకు రావాల్సి వచ్చింది. వీరిని తరలించేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ గంగ పేరుతో ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. ఈ విమానాలు హంగరీ, రోమేనియాల నుండి విద్యార్ధులను తరలిస్తోంది. అయితే ఉక్రెయిన్ నుండి విద్యార్ధులు సరిహద్దు దేశాలకు వచ్చే క్రమంలో వారిపై ఎటువంటి దాడులు జరగకుండా ఉండేందుకు విద్యార్ధులను భారత జాతీయ జెండా (తివర్ణ పతాకం)తో రావాలని కేంద్రం సూచించింది.
పాకిస్తాన్, టర్కీ విద్యార్దులు కూడా
దీంతో భారత విద్యార్ధులు ఈ జాతీయ జెండా చేబూని సరిహద్దు దేశాలకు చేరుకుంటున్నారు. ఇదే క్రమంలో ఉక్రెయిన్ నుండి బయలుదేరిన పాకిస్తాన్, టర్కీ విద్యార్ధులు సైతం ప్రాణభయంతో భారత జాతీయ జెండాను ఉపయోగించుకున్నారు. ఉక్రెయిన్ నుండి రోమేనియా రాజధాని బూకారెస్ట్ నగరానికి చేరుకున్న భారతీయ విద్యార్ధులు మాట్లాడుతూ.. యుద్ధం కారణంగా నెలకొన్న పరిస్థితుల్లో ఉక్రెయిన్ లోని పలు చెక్ పోస్టులను సురక్షితంగా దాటేందుకు మన జాతీయ పతకం ఎంతో ఉపయోగపడిందనీ, తమతో పాటు కొంత మంది పాక్, టర్కీ విద్యార్ధులకు భారత జాతీయ జెండా చేబూని చెక్ పోస్టులు దాటారని చెప్పారు.