శివాభిషేకం.. హిందు సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన కార్యం. అత్యంత శక్తివంతమైన ప్రక్రియ శివాభిషేకం. ఏ పనికాకపోయినా, రోగాలతో బాధపడతున్న, దారిద్య్రం పోవాలన్న శివాభిషేకం చేయించమంటారు.
అయితే శివుడికి అభిషేకం అనేక రకాలుగా చేస్తారు. వాటిలో అనేక ద్రవ్యాలు ఉపయోగిస్తారు. అయితే ముఖ్యంగా పవిత్రమైన గోవుపాలు అభిషేకంలో ఉపయోగిస్తే కలిగే ఫలితం తెలుసుకుందాం…సాధారణంగా ప్రతి మానవుడు తెలిసో, తెలియకో తప్పులు చేస్తుంటారు.ఆవుపాలు, అభిషేకం చేస్తే నరకాన్ని తెచ్చిపెట్టే పాపఫలంతో పాప విముక్తి దూరమవుతుందని శాస్త్రాలు చెపుతున్నాయి.
ఆవుపాలంటే మహావిష్ణువుకు అమిత ఇష్టమని, అందువల్ల గోవు పాలతోశివలింగాన్ని అభిషేకించే భక్తుడు శివుడికి ఇష్టమైన విష్ణులోకంలో సుఖంగా ఉండే అదృష్టం పొందుతాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఏది చేసినా చిత్తం శివుడిపై పెట్టి పూజాభిషేకం చేయాలి.