తెలుగుదేశం పార్టీ అధినేత.. మాజీ ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…. ఏపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు అని చెప్పి బడుగు, బలహీన వర్గాల దగ్గర నుండి స్థలాలను లాక్కుందని… అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉండే భూములను, బురద నేలలను, తడి నేలను, అటవీశాఖకు చెందిన భూములను, మడ భూములను అక్రమంగా పొందారని చెప్పారు.
పైన చెప్పబడినవి ఏవీ ఇళ్ళు నిర్మించడానికి అనువైన స్థలాలు కావని అన్నారు. ఉదాహరణకు దాదాపు 600 ఎకరాల బురద నేలను జగన్ ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లాలోని రాజనగరం అసెంబ్లీ పరిధిలోని కోరుకొండ మండలం లో బురుగుపూడి గ్రామంలో పేదలకు ఇళ్లు కేటాయిస్తున్నారని.. ఇక ఎకరాకు 45 లక్షలు చొప్పున మొత్తం 270 కోట్ల రూపాయలు ఇందుకోసం ఖర్చు చేశారని అన్నారు.
ఈ బురద నేలల నేలమట్టం పెంచేందుకు మరొక 250 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని బాబు అన్నారు. అలా పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే నేపథ్యంలో జగన్ ప్రభుత్వం 500 కోట్ల రూపాయల స్కామ్ పాల్పడుతోందని చంద్రబాబు అన్నారు. ఇది పర్యావరణ శాఖ రూల్స్ కు పూర్తి విరుద్ధంగా ఉందని…. అలాగే ఇలా బురద నేల పై ఇలా మట్టి పోసి మట్టం పెంచినప్పుడు వాటి మీద కట్టబడ్డ బిల్డింగ్ లు ఎక్కువ కాలం నిలవవని అన్నారు. చంద్రబాబు ఈ విషయం మొత్తాన్ని ఒక లేఖ రూపంలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ కి రాయడం గమనార్హం.