Ayyappa Swamy: కఠిన నియమ నిష్టలతో దీక్ష
కార్తీకమాసం ( Karthikamasam ) ప్రారంభం నుంచి మకరసంక్రాంతి వచ్చే వరకూ ఎక్కడ చూసినా అయ్యప్ప స్వాములు, శరణు ఘోష వినబడుతుంటుంది. 41 రోజుల వరకు ఎంతో కఠిన నియమ నిష్టలతో దీక్ష పాటిస్తారు. నేల పడక, చన్నీటి స్నానాలు , ఒక్కసారే భోజనం, వేసుకోక పోవడం వంటి నియమాలు పాటిస్తారు. ఈ నియమాల వెనుక కేవలం భక్తి మాత్రమే కాదు,ఎన్నో ఆరోగ్య రహస్యాలు కూడా దాగి ఉన్నాయి.
Ayyappa Swamy: ఆరోగ్య రహస్యాలు
నేలమీద నిద్రపోవడం వల్ల వెన్నునొప్పి తగ్గడం తో పాటు కండరాలు పటిష్టంగా మారతాయి. రక్త ప్రసరణ ( Blood Pressure ) కూడా బాగా జరుగుతుంది.తెల్లవారు జామునే నిద్ర మేల్కోవడం అనేది చైతన్యానికి ప్రతీక గా చెప్పబడింది. సూర్యోదయం కాక ముందే చన్నీటి తో స్నానం చేయడం వల్ల శరీరంలో ఉన్న నాడీ వ్యవస్థ ఉత్తేజం గా మారుతుంది. దీని తో ముఖంలో ప్రశన్నత స్పష్టం గా కనిపిస్తుంది.
స్నానానం తరువాత చేసే దీపారాధన యొక్క కాంతి అక్కడ ఉన్న ఆవరణ మొత్తాన్ని ఆధ్యాత్మికంగా మారుస్తుంది . శ్రద్ధగా చేసే పూజ వల్ల మనసు చాలా తేలికపడుతుంది. సామూహికంగా కలిసి చేయడం వలన క్రమశిక్షణ అలవాటవుతుంది. ఇతర భక్తులతో కలిసి ఇచ్చిపుచ్చుకునే స్వభావం బాగాపెరుగుతుంది .రెండు పూటలా స్నానం, దుస్తులుబట్టలు మార్చడం వలన శుభ్రమైనబట్టలు ధరించడంఅలవాటుగా మారుతుంది. క్రమం తప్పకుండా పూజ చేయడం ,పాల్గొనడం వల్ల సంఘజీవనానికి దారి చూపుతుంది.
ఆలోచనల యొక్క సామర్థ్యం
ఎక్కువగా మాట్లాడటం, గొడవలకు దూరంగా ఉండటం వల్ల సమయం వృధా కాకుండా ఆలోచనల యొక్క సామర్థ్యం పెరుగుతుంది.
ఒక్కపూటే భోజనం చేయడం వల్ల మితాహారాన్ని తీసుకోవడం,శాఖాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం కలుగుతాయి.
పొగ తాగడం తో పాటు మద్యపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉండటం వలన ఆరోగ్యం బాగుంటుంది.