Family relations: దీపం వెలిగించడంకుటుంబసభ్యులు ఎవరైనా చనిపోతే, ఒక సంవత్సరం పాటు ఏవిధమైన పూజలు చేయకూడదని ఒక రకమైన మూఢ ప్రచారం జరుగుతుంది. మరికొందరు దీపం వెలిగించడం కాదుకదా… దేవుడి పటాలను ఒక వస్త్రం లో చుట్టేసి,అటక మీదకు ఎక్కించేస్తారు. సంవత్సరీకాలన్నీ పూర్తయిన తర్వాత దేవుళ్ళ పటాలను దింపి అప్పుడు శుభ్రం చేసి అప్పుడు పూజ ప్రారంభిస్తారు. ఇంట్లో వ్యక్తి మరణించిన సంవత్సరం వరకు దీపారాధాన, నివేదన వంటివి ఏమి ఉండవు. ఇది మంచి పద్దతి కాదు. శాస్త్రం లో ఇలా చేయమని ఎక్కడ చెప్పలేదు.
Family relations: రోజూ గుడికి
దీపం లేని ఇల్లు స్మశానంతో సమానం అని అంటారు. దీపం శుభానికి గుర్తు. దీపం వెలిగిన ప్రదేశానికి దేవతలు వస్తారు. ప్రతి ఇంట్లో నిత్యం దీపారాధాన చేసుకోవాలి. ఒకవేళ ఇంటిలో వ్యక్తి మరణిస్తే ఇంట్లో 11 వ రోజు తర్వాత శుద్ధి కార్యక్రమం ఉంటుంది. 12 వ రోజు శుభస్వీకారం అనేది జరుగుతుంది. ఆ కుటుంబం ఆ 11 రోజులలో మాత్రమే ప్రత్యేకంగా పూజ చేయకూడదు అని మాత్రమే శాస్త్రం చెప్పింది కానీ సంవత్సరం అంతా పూజలు చేయకూడదని చెప్పలేదు. ఇంకా చెప్పాలంటే సూతకంలో ఉన్నప్పుడు కూడా సంధ్యావందనం చేసుకుని అర్ఘ్యప్రధానం వరకు బాహ్యంలో చేసి, మిగిలినది మానసికంగా చేసుకోవాలని శాస్త్రం తెలియచేసింది. సంవత్సరం వరకు గుడికి వెళ్ళకూడదని కూడా ఎక్కడా లేదు. మనం నిత్యం చేసే పూజ చేసుకోవడానికి ఎలాంటి అభ్యన్తరం లేదు అని గమనించండి. కాకపొతే కొత్తగా ఎలాంటి పూజలు అనేవి మొదలు పెట్టకూడదు. ఇంతకముందు వరకు రోజూ గుడికి వెళ్లే అలవాటు ఉంటే సూతకం అయిన తర్వాత యధావిధిగా గుడికి వెళ్ళవచ్చు.
దైవారాధన
కాబట్టి తప్పకుండా ఇంట్లో ప్రతి రోజు దీపారాధన, దైవారాధన జరుగుతూనే ఉండాలి. అలా జరుగుతూ ఉండడం వలన ఇంటికి గానీ, కుటుంబ సబ్యులకు కానీ కానీ ఎలాంటి దోషాలున్నా, వాటిని ఆపే శక్తి ఆ ఇంట్లో జరిగే దైవారాధనకు ఉంటుంది. ఈ విషయంలో పూజలు చేసుకోవచ్చు అనేకంటే చేసి తీరాలి అని చెప్పడం కరెక్ట్ గా ఉంటుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?