ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎన్నో లక్షల మంది ప్రాణాలు తీసుకుంది, ఇప్పుడు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా దాని బారి నుండి ఇంకా మానవాళి పూర్తిగా తప్పించుకోలేదు. ఇంకా వైరస్ బాధితుల కి వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అది అందలేదు. పైగా సైడ్ ఎఫెక్ట్స్ పై వస్తున్న ప్రచారాలు కూడా జనాలను భయపెడుతున్నాయి. ఇలాంటి సమయంలో వైరస్ తెలియకుండానే మనుషులకి వచ్చినట్లు…. బయటకు లక్షణాలు కనిపించడం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఇలాంటి సమయంలో కరోనా టెస్టులు చేయించుకునే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. అందరూ మామూలు జీవితాలకు అలవాటు పడిన తర్వాత జనాలు బారెడు క్యూ లైన్ లలో నిల్చుని టెస్ట్ చేయించుకోవడానికి మొగ్గు చూపట్లేదు. అందుకోసమే ఇప్పుడు కొత్త తరహా పరీక్షలు కూడా వచ్చేసాయి. ఇందులో భాగంగా కరోనా పాజిటివా కాదా అని చెప్పే మాస్క్ ను క్యాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. ఈ మాస్క్ ని పెట్టుకున్న కాసేపటికే మనం గాలి వదిలే స్వభావాన్ని బట్టి వైరస్ ఉందా లేదా అనే విషయాన్ని కనుగొనేందుకు రూపొందించారు.
కరోనా పాజిటివ్ అయితే పరికరానికి ఉన్న పల్చటి చార రంగు మారిపోతుంది. ఇక ఈ విషయాన్ని బట్టి వైరస్ శరీరంలో ఉందా లేదా అన్న విషయాన్ని చెప్పవచ్చు. ఈ పరికరం తయారీకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ 13 లక్షల డాలర్ల నిధులు సమకూర్చింది. ఈ మాస్క్ ధరించినపుడు శ్వాస కణాల్లో కరోనా వైరస్ ఉందా లేదా అన్న విషయాన్ని గుర్తిస్తారు. ఒకవేళ ఉంటే మాస్కు కి తగిలించి ఉన్న స్టిక్కర్ రంగు మారిపోతుంది. ఇప్పుడు తక్కువ ధరకు దీనిని అమ్మే విధంగా రూపొందించారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ మాస్క్ ధరించడం వల్ల వైరస్ నివారించే వీలుంది అని చెబుతున్నారు.