పెద్ద పెద్ద శబ్దాలు, వాటితో ఏర్పడే శబ్ద కాలుష్యం వల్ల హైబీపీ, క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. సహజంగా మన చెవి 25 నుంచి 40 డెసిబిల్స్ వరకు సాధారణ శబ్ధాన్ని మాత్రమే వినేఅవకాశంఉంది.చాలా తక్కువ కొన్ని సందర్భాల్లో మాత్రమే 60 నుంచి 80 డెసిబుల్స్ అయినా తట్టుకుంటుంది.
అంతకు మించి ఎక్కువ శబ్ధాన్ని వింటే మానసిక సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని శబ్ధ తీవ్రత వలన అనారోగ్య సమస్యలు వస్తాయి. శబ్ధం మన మెదడు పై నాడీ వ్యవస్థ మీద, బాగా ఒత్తిడిని కలుగజేస్తుంది. దీని వలన ఒక్కోసారి శాశ్వత వినికిడి శక్తి ని పోగొట్టుకునే ప్రమాదం కూడా ఉంది.
వివిధ మతపరమయిన కార్యక్రమాల్లో ఉపయోగించే లౌడ్ స్పీకర్ల వల్ల వినికిడి లోపం కలుగుతోంది. కొంతమంది అకస్మాత్తుగా వినికిడి లోపం కలిగిందనిఅనుకుంటారు. ధ్వనుల మధ్య నిత్యం తిరుగుతూ, ఎక్కువ మంద్రస్థాయిలో మ్యూజిక్ విని ఎంజాయ్ చేసేవారికి ఈ ప్రమాదం ఎక్కువని గ్రహించాలి.
శబ్ధ కాలుష్యం కారణంగా శారీరక, మానసిక వ్యవస్థలపై తీవ్రమైన ఒత్తిడి పడుతుందని అనేక సర్వేలు చెబుతున్నాయి. శబ్ధ తరంగాలు చెవి నుంచి నేరుగా నాడీ వ్యవస్థ నుంచి మెదడుకు చేరుతాయి. వినికిడి లోపం పెరిగితే అది క్రమేపీ నిద్రలేమికి, ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు.
శబ్ధ కాలుష్యం కారణంగా రక్తపోటు పెరుగుతుందని తేలింది. దీని కారణంగా గుండె సమస్యలు వచ్చే ప్రమాదముందని.. ఇప్పటికే ప్రతి ఐదుగురిలో ఒకరు శబ్ధ కాలుష్యం కారణంగా అనారోగ్యానికి గురవుతున్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా చిన్నారులు, వృద్ధుల పై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందట.
కాలుష్యాన్ని అరికట్టేందుకు అటు ప్రభుత్వం, ఇటు అధికారులు ఎన్ని కొత్తమార్గాలను వెతికిన అవి సత్ఫలితాలివ్వలేదు. ఇది ఏ ఒక్కరితోనో సాధ్యం కాదు. ఎవ్వరికి వారు తగు జాగ్రత్త తీసుకుంటే తప్ప ఈ ముప్పునుండి బయట పడలేము అన్నది గుర్తుపెట్టుకోవాలి.
Disclaimer : పైన సూచించిన ఆరోగ్య సూత్రాలు, లేదా హెల్త్ కి సంబంధించిన ఇన్ఫోర్మేషన్ ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది మాత్రమే. అవన్నీ పాటించే ముందర తప్పనిసరిగా స్పెషలిస్ట్ డాక్టర్ సలహా తీసుకోండి.