Papaya fruit : బొప్పాయి పండు గురించి మనలో చాలా మందికి తెలుసు.బొప్పాయి పండు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.అలాగే బొప్పాయి పండు వలన పలు రకాల అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. బొప్పాయిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు అధికంగా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. ఇక డెంగీ వచ్చిన వారికి అయితే బొప్పాయి ఒక దివ్య ఔషదం అనే చెప్పాలి.అయితే ఇన్ని ఉపయోగాలు ఉన్న బొప్పాయి పండును కొందరు తినకూడదు అనే విషయం మనలో చాలా మందికి తెలియదు.కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడే వారు బొప్పాయి పండుకు దూరంగా ఉంటే మంచిది.మరి ఎవరెవరు ఈ బొప్పాయి పండును తినకూడదో తెలుసుకుందామా..
గర్భిణీలు:
కడుపుతో ఉన్న మహిళలు బొప్పాయి పండును ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. ఎందుకంటే ఇందులో ఉండే పలు రసాయనాలు డైరెక్ట్ గా గర్భాశయంపై ప్రభావం చూపుతాయి. ఫలితంగా గర్భశ్రావం అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే బొప్పాయి పండును గర్భిణీలు తినరాదు. అంతేకాకుండా బొప్పాయి పండు ఎక్కువగా తింటే శరీరంలో వేడి అధికం అవుతుంది కావున గర్భిణీలు బొప్పాయి పండుకు కాస్త దూరంగా ఉంటే బెటర్.
బాలింతలు :
కడుపుతో ఉన్న మహిళలే కాకుండా పిల్లలకు పాలిచ్చే తల్లులు కూడా బొప్పాయి పండును తినకుండా ఉంటే మంచిది. కొందరు బొప్పాయి తింటే పాలు పడతాయి అని చెప్తారు.కానీ బొప్పాయి పండును ఎక్కువ మొత్తంలో తింటే వారు ఇచ్చే పాలతో పలు రసాయనాలు బిడ్డ శరీరంలోకి వెళ్తాయి. ఫలితంగా పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.కనుక పాలిచ్చే తల్లులు కూడా బొప్పాయి పండుకు దూరంగా ఉంటే మంచిది.
ఎలర్జీ సమస్య ఉన్నవారు :
బొప్పాయి పండును తింటే కొందరికి అలర్జీలాగా వస్తుంది.కావున బొప్పాయి పండు తింటే పడని వారు బొప్పాయి పండుకు దూరంగా ఉంటే మంచిది.అలాగే బీపీ సమస్యతో బాధపడేవారు, బీపీ ట్యాబ్లెట్లు వేసుకునే వారు బొప్పాయి పండును తక్కువ మొత్తంలో తినాలి.