Parents: తాజగా మహారాష్ట్రలోని లతుర్ జిల్లా పరిషత్ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. కన్న బిడ్డలే వృద్ధాప్య దశలో ఉన్న తల్లిదండ్రులను Parents నిర్లక్ష్యం చేస్తున్నందున లతుర్ జిల్లా పరిషత్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల జడ్పీలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు వృద్ధులయిన తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని జడ్పీ కి ఫిర్యాదులు అందాయి. వెంటనే జడ్పీ ఆ ఏడుగురు ఉద్యోగులు వేతనాల్లో 30శాతం కోత విధించింది.
ఈ విషయన్ని లతుర్ జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ అయిన రాహుల్ బోండ్రే స్పష్టం చేసారు. తమకు మొత్తం 12 మంది ఉద్యోగులు ఇలా తమ తల్లిదండ్రులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఫిర్యాదులు వచ్చాయని ఆయన తెలిపారు. మొత్తం ఆ 12 మంది ఉద్యోగులలో ఆరుగురు పేరెంట్స్ టీచర్లు అని ఆయన తెలిపారు. ఇక అన్నీ విచారించి ఆ ఏడుగురు ఉద్యోగుల జీతాలలో నుంచి ఏకంగా 30 శాతం కోత విధించినట్లు చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా ఉద్యోగుల జీతాలలో నుంచి విధించిన కోత ను నేరుగా వారి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తున్నామని బోండ్రే తెలియజేసారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేస్తున్న ఉద్యోగుల వేతనాలలో నుంచి కోత విధించాలని గతంలోనే జడ్పీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
జిల్లా పరిషత్ చేసిన తీర్మానం నేపథ్యంలో గత సంవత్సరం డిసెంబర్ నుంచే ఉద్యోగుల జీతాలతో నుంచి ఈ వేతనాల కోత మొదలైంది. ఇక నుంచి ఈ 30శాతం వేతనం కోత తీర్మానం ప్రతి నెలా కొనసాగుతుందని ఆయన తెలియజేసారు. ఇదిలా ఉండగా ఉద్యోగుల జీతాల నుంచి కోతలు అమలు చేసిన తర్వాత నుంచి వారు దారికి వచ్చిన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అధికారుల అస్త్రం ఉద్యోగుల మీద బాగానే పనిచేసిందని చెప్పాలి.