ఇప్పటికే ప్రపంచంలో ఎన్నో దేశాలలో కరోనా వాక్సిన్ కోసం పరిశోధనలు జరుపుతున్నాయి. అందుబాటులో ఉన్న కొన్ని వాక్సిన్ లను ప్రస్తుతం అత్యవసర వినియోగానికి మాత్రమే వాడుతోన్న విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా వైరస్ లో వేగంగా కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే ఎంతోకాలంగా దీనిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. ప్రజలకు వ్యాక్సిన్ అందించడంలో ఇంకా ఆలస్యం చేస్తే ఇంకా కొత్త కొత్త రకాల కరోనా వైరస్ లు రూపుచెందుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే బ్రిటన్ ను వణికిస్తున్న కొత్త స్ట్రెయిన్ వెలుగులోకి రావడంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ కరోనా స్ట్రెయిన్ కొవిడ్-19 కంటే 10 రెట్లు వేగంగా విస్తరిస్తుండడంతో నిపుణులకు ఏమి పాలుపోవడంలేదు. ఇంక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వ్యాక్సిన్ లను వేయాలని, కరోనా కట్టడి జాగ్రత్తలను పాటిస్తూ తమ వంతు జాగ్రత్త ప్రజలు తీసుకోవాలని చెబుతున్నారు. జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రస్తుతం కరోనా వైరస్ లో చోటు చేసుకుంటోన్న ఈ జన్యు మార్పుల వల్ల కొత్త కొత్త సమస్యలకు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతానికి బ్రిటన్ దేశంలో నమోదయిన ఈ కొత్త కరోనా స్ట్రెయిన్ వల్ల పెద్దగా తీవ్ర అనారోగ్య సమస్యలయితే తలెత్తలేదు కానీ జన్యు మార్పు జరిగిన తరువాత అది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. రానున్న రోజుల్లో కొత్త రకం కరోనా వైరస్లు రూపుచెందింతే అవి ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలకు లొంగకపోవచ్చని కొన్ని ల్యాబ్ ప్రయోగాలు సూచిస్తున్నాయట. కానీ భవిష్యత్తులో ఈ కరోనా వైరస్లో భారీగా జన్యు మార్పులు జరిగితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ ఫార్ములాలను మార్చాలిసి ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు. ఈ మహమ్మారికి అంతం ఎప్పుడో వేచి చూడాలి!!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?