అల్లు అర్జున్ ఈ ఇయర్ ప్రారంభంలోనే అల వైకుంఠపురంలో సినిమాతో భారీ కమర్షియల్ హిట్ ని సాధించాడు. అంతేకాదు ఈ సినిమా సరిలేరు నీకెవ్వరు సినిమాతో పోటీ పడి ఇండస్ట్రీ రికార్డ్ క్రియోట్ చేసింది. అల్లు అర్జున్ -త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా వచ్చిన అల వైకుంఠపురంలో సినిమా అల్లు అర్జున్ ఇమేజ్ ని భారీగా పెంచేసింది. చెప్పాలంటే పాన్ ఇండియా సినిమా రేంజ్ పాపులారిటీ వచ్చింది. బాలీవుడ్ ప్రముఖులు కూడా అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమా గురించి చర్చించుకున్నారు. దీంతో తన తర్వాత సినిమా నుంచి ఖచ్చితంగా పాన్ ఇండియా టార్గెట్ గా కథ ఉండేలా ఎంచుకుంటున్నాడు.
ఈ విషయం అల్లు అర్జున్ ఎంచుకుంటున్న కథ, దర్శకుల ఎంపిక ను చూస్తే అర్థం అవుతుంది. ప్రస్తుతం ఇంటిలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ తో పుష్ప సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా పాన్ ఇండియా కేటగిరీలో రూపొందుతుందని ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ప్రకటించారు. తెలుగు తో పాటు మరో నాలుగు భాషలలో ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఈ సినిమా అల్లు అర్జున్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. ఈ సినిమాకి దేవీశ్రీప్రసాద్ సంగీతమందిస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక రీసెంట్ గా సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తో అల్లు అర్జున్ తన 21వ సినిమాని అధికారకంగా ప్రకటించాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం కొరటాల శివ కూడా యూనివర్సల్ సబ్జెక్టు అల్లు అర్జున్ కోసం తయారు చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. మొత్తానికి అల్లు అర్జున్ పాన్ ఇండియా ఇమేజ్ ని సాధించాలన్న టార్గెట్ ని గట్టిగా పెట్టుకున్నాడు ఈ స్టైలిష్ స్టార్.