బాహుబలి సినిమాతో తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చూపించిన రాజమౌళి దర్శకుడు..టాలీవుడ్ స్టార్స్ మెగా పవర్ స్టార్ రాం చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోలు…. 350 కోట్లకి పైగానే కేటాయించిన భారీ బడ్జెట్..అన్ని ఇండియన్ భాషల్లో పాన్ ఇండియాగా రిలీజ్ కి సన్నాహాలు. ఇది రాజమౌళి తెరకెక్కిస్తున్న “రౌద్రం రణం రుథిరం” సినిమా గురించి చెప్పాలంటే. అయితే అందరు అనుకున్నట్టు ఆర్ ఆర్ ఆర్ 2021 కి రెడీ అవడం కూడా కష్టమని చెప్పుకుంటున్నారు. మరి కరోనా కొట్టిన దెబ్బ సామాన్యమైనదా…మొత్తం ఇండస్ట్రీనే కుదేలైపోయింది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్ ఆర్ ఆర్ రాజమౌళి చెప్పిన 2021 సంక్రాంతికి వచ్చేలా కనిపించడం లేదని యూనిట్ కూడా భావిస్తుందని తాజా సమాచారం. ఇది మామూలు సినిమా అయితే చెప్పిన సమయానికి రావడనికి అవకాశం ఉండేదేమో. కాని వీఎఫెక్స్ .. గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువ. కాబట్టి కష్టమే. పర్మిషన్ వచ్చినప్పటి నుంచి షూటింగ్ మొదలు పెట్టడానికి రాజమౌళి ప్రయత్నిస్తున్నా పరిస్థితులు అనుకూలించడం లేదు. ఇప్పటికే పూణె లో జరపాల్సిన షెడ్యూల్ అటు తిరిగి ఇటు తిరిగి హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో కి చేరుకుంది. ఇప్పుడు అక్కడ ఆర్ ఆర్ ఆర్ కోసం సెట్ నిర్మిస్తున్నారు.
ఈసారి ఎలాగైనా రాజమౌళి చిత్రీకరణ మొదలు పెట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నాడట. ఇప్పటికే నిర్మాతకి బాగా ఆర్ధిక నష్టం జరిగింది. ఇక మీదట అలా జరగకుండా ఉండాలంటే వీలైనంత త్వరగా సినిమాని రిలీజ్ కి రెడీ చేయాలి. ముంబై నుంచి ఆలియా భట్ వచ్చే పరిస్థితి లేకపోయినా చిత్రీకరణ మాత్రం జరుగుతుందని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాతో పాటు ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమాకి సెట్ నిర్మిస్తున్నారు. ఆ సెట్ వకీల్ సాబ్ కోసమే. ఈ సినిమా దాదాపు కంప్లీటయింది. ఇప్పుడు వేస్తున్న సెట్ లో మిగిలి ఉన్న ఆ కొద్ది భాగం చిత్రీకరణ పూర్తి చేయనున్నారు. కాస్త అటు ఇటు గా ఈ రెండు చిత్రాలతో షూటింగ్ మొదలు కాబోతుంది.