తమిళనాడు రాష్ట్రంలో జూన్ 3వ తేదీ అడుక్కంబరైర్లోని అమ్మన్ ఆలయంలో అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతున్న సమయంలో ” ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు ” అంటూ పెళ్లి మండపం లో ఆ అమ్మాయి ఒక్క అరుపు అరిచింది. ఆ అరుపుకి ఆలయంలో ఉన్నవారు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. సరిగ్గా పెళ్లి కొడుకు తాళి కడుతున్న టయానికి అమ్మాయి వచ్చి ఆలయంలో రచ్చ రచ్చ చేయటంతో ఒక్కసారిగా పరిస్థితి అంతా మారిపోయింది. పెళ్లి పీటలు నుండి సిచువేషన్ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది.
పూర్తి విషయంలోకి వెళితే వేలూరు సమీపంలోని మేట్టు ఇడయాంబట్టి గ్రామానికి చెందిన రామచంద్రన్ (45)కు కమలితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. తొర్రపాడిలో టైలర్ దుకాణం నిర్వహిస్తూ కుటుంబ పోషణ చేస్తున్నాడు. అయితే భార్యాభర్తల మధ్య కలహాలు మొదలయ్యాయి. గొడవల కారణంగా ఇద్దరు వేరువేరుగా ఐదు సంవత్సరాల నుంచి దూరంగా ఉంటున్నారు. ఒంటరిగా ఉంటున్న రామచంద్రన్ బంధువుల ఇంటికి వెళ్లిన టైంలో ఓ యువతి తో పరిచయం ఏర్పడటంతో అది కాస్త ప్రేమగా మారటంతో పెళ్లికి రెడీ అయ్యారు.
ఈ సందర్భంగా జూన్ మూడవ తేదీ అడుక్కంబరైర్లోని అమ్మన్ ఆలయంలో వివాహ ఏర్పాటు చేసుకున్నారు. రెండు కుటుంబాలకు చెందిన బంధువులు అంత ఈ పెళ్లికి హాజరైన సమయంలో సరిగ్గా రామచంద్రన్ తాళి కడుతున్న టైములో మొదటి భార్య కమలి తన ఇద్దరు కుమారులతో వచ్చేసింది. పెళ్లి దుస్తుల్లో కనిపించిన రామచంద్రన్ ని నిలదీసింది. ఈ పరిణామంతో కొత్త పెళ్ళికూతురు బంధువులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఇదే టైములో పెళ్ళికొడుకు రామచంద్రాన్ కి గుండెపోటు రావడంతో పోలీసులు ఎంటర్ కావటంతో వివాహం ఆగిపోయింది. పెళ్ళికొడుకు ని హాస్పిటల్ కి తీసుకెళ్లగా మిగతా పంచాయితీ ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.