అరటిపండ్లు ఆరోగ్యానికి కూడా చాలామంచిది. అన్నికాలాలలోనూ దొరికే ఈ పండ్లు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులుతెలియచేస్తున్నారు.అరటి పండ్లలోచాల రకాలు ఉంటాయి .ఆకుపచ్చ,పసుపు, ఎరుపు, రంగుల్లో అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా లైంగిక సామర్థ్యాన్ని పెంచడం లో ఎరుపు రంగుఅరటిపండ్లు బాగా పనిచేస్తాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.లైంగిక సమస్యలతో బాధపడేవారు వీటినిక్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితముంటుందనిచెబుతున్నారు.
అలాగే కంటి చూపు మెరుగుపరచడం లో కూడా ఎరుపు రంగు అరటి పండ్లు తో ఎంతో మేలుజరుగుతుంది . కంటి సమస్యల్ని ఈ పండు సమర్ధవంతం గా తగ్గిస్తుంది. అలాగే దృష్టి సమస్యలతో బాధపడే వారు, రోజూ ఒక అరటిపండు ను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు కాదు నరాల బలహీనత సమస్యల నుండి బయట పడడానికి కూడా ఈ పండ్లు ఉపయోగపడతాయి అని తెలియచేస్తున్నారు.
నరాల బలహీనత సమస్యతో బాధపడేవారు రోజూ రాత్రి భోజనానికి తర్వాత 48 రోజుల పాటు ఎరుపు అరటిని తీసుకుంటే నరాలు బలపడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. స్త్రీలు రోజుకు కనీసం రెండు అరటిపళ్ళు తినడం వల్ల కేన్సర్ వంటి ప్రమాదకరమైన సమస్య నుంచి కూడా రక్షణ పొందవచ్చని చెబుతున్నారు. అంతేకాక గర్భాశయంలో ఏర్పడే కొలొరెక్టల్ కాన్సర్ని అరికడుతుంది.
ఈ పండ్లని అలాగే తిన్నా.. జ్యూస్ చేసుకుని తాగిన కూడా కిడ్నీరాళ్ల, అధిక రక్తపోటు సమస్యలు దూరం అవుతాయని అంటున్నారు నిపుణులు.. బరువు తగ్గాలనుకున్నా కూడా రోజు కో ఎరుపు రంగు అరటిపండు తింటే చాలని ఆయుర్వేద నిపుణులుసలహా ఇస్తున్నారు. కేలరీల విషయానికి వస్తే మిగతా అరటిపండ్ల తో పోలిస్తే ఎరుపురంగు అరటిపండ్లలో తక్కువగా ఉంటాయి.
అందుకే బరువు తగ్గాలని భావించేవారు రోజుకో అరటిపండును తింటే మంచిది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. దీంతో ఆహారం తక్కువగా తీసుకుంటారు. అందువల్ల బరువు కూడా తగ్గడం కాయమని వైద్యనిపుణులు చెబుతున్నారు.