కరోనా దెబ్బకు గత ఏడాది అల్లు అర్జున్ “అల వైకుంఠ పురంలో” సినిమా మినహా మరే హీరో సినిమా విడుదల కాలేదు. విడుదలైన “అల వైకుంఠపురంలో” బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి ఇండస్ట్రీకి సంక్రాంతి పండుగ నేపథ్యంలో మంచి ఓపెనింగ్ ఇచ్చినా గాని మహమ్మారి ఎంట్రీ ఇవ్వటంతో పరిస్థితులు మొత్తం మారిపోయాయి.
ఏడాది ప్రారంభంలో పవన్ నటించిన “వకీల్ సాబ్” సినిమా మే 15వ తారీఖున రిలీజ్ అవుతుందని, దీంతో 2020 సంవత్సరం మెగా అభిమానులకు పూనకాలు తెచ్చే సంవత్సరమని అప్పట్లో కథనాలు రాగా.. వాటినన్నిటిని తల్లకిందులు చేసింది కరోనా. కానీ తాజాగా ఈ ఏడాది మాత్రం మెగా అభిమానులకు పండగే అన్న టాక్ ఇండస్ట్రీలో వినబడుతుంది.
వ్యాక్సిన్ వచ్చేవారం అందుబాటులోకి రావటంతో పాటు బాక్సాఫీస్ దగ్గర భారీ స్థాయిలో మెగా హీరోల సినిమాలు విడుదల అవటానికి క్యూలో ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. పవన్ “వకీల్ సాబ్”, చిరంజీవి “ఆచార్య”, రామ్ చరణ్ “RRR”, అల్లు అర్జున్ “పుష్ప” సినిమా ఇంకా మెగా కుర్ర హీరోల సినిమాలు రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉండటంతో… 2021 మెగా నామ సంవత్సరం అని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. మెగా హీరోల సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కొన్ని కోట్ల రూపాయల వ్యాపారానికి ఈ ఏడాది వేదిక కానుందని ట్రేడ్ వర్గాలు చెప్పు కొస్తున్నాయి. మరి మెగా హీరోలలో ఎవరు అలరిస్తాడో చూడాలి. ముఖ్యంగా దాదాపు రెండు సంవత్సరాలు గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇవ్వటంతో తో.. వకీల్ సాబ్ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి.