Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఐదవ వారం గేమ్ చాలా రసవత్తరంగా సాగుతోంది. ఈవారం కెప్టెన్ ఎవరు అవుతారు అన్నది సస్పెన్స్ గా నెలకొంది. రాజ్యానికి ఒకటే రాజు అనే టాస్క్ ఈ ప్రక్రియతో ప్రారంభమైన కెప్టెన్సీ పోటీలో… ప్రియా, రవి, యానీ, శ్వేత పోటీ పడుతూ ఉన్నారు. వీరిలో ఎవరు కెప్టెన్ అవుతారన్నది చాలా ఉత్కంఠభరితంగా ఉంది. ఇదిలా ఉంటే దాదాపు పది రోజుల క్రితం నుండి హౌస్లో షణ్ముఖ్ జస్వంత్, జెస్సీ, సిరి ముగ్గురు హౌస్ లో సెపరేట్ గ్రూప్ పెడుతూ డిస్కషన్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో కెప్టెన్ శ్రీరామ్ తో…జెస్సీ కి… కిచెన్ లో పెద్ద గొడవ జరగడంతో.. వేల గ్రూపు సపరేట్గా అందరికీ టార్గెట్ అయినట్టు ఇప్పుడు మారిపోయింది.
గట్టిగా ఈ ముగ్గురిని టార్గెట్ చేయడం
సన్నీ టీంలో వీలు కీలకంగా రాణించిన ఈ ముగ్గురు.. గురించి మిగతా 11 మంది సభ్యులు భయంకరంగా చర్చించుకుంటున్నారు. విశ్వ, రవి, లోబో అయితే గట్టిగా ఈ ముగ్గురిని టార్గెట్ చేయడం జరిగింది. త్రిమూర్తులు అనే పేరు కూడా పెట్టేశారు. పరిస్థితి ఇలా ఉంటే షణ్ముక్ మాత్రం రవికి పెద్ద చాన్స్ ఇవ్వకుండా అతనిది… ఫేక్ గేమ్ అని గట్టిగా బలంగా నమ్ముతున్నాడు.
రాజ్యానికి ఒక్కడే రాజు అనే టాస్క్ లో
ఇందువల్లే రాజ్యానికి ఒక్కడే రాజు అనే టాస్క్ లో… రవికి పట్టాభిషేకం జరిగిన తరువాత అంత క్యాజువల్ పరిస్థితి మారాక… రవి సపరేట్ గా షణ్ముఖ్ తో… మాట్లాడాలని తనతో ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవాలని తెలియజేయగా హార్ట్ ఫుల్ గా మాట్లాడాలి అని కూడా కోరగా… హృదయపూర్వకంగా అయితే బయట మాట్లాడుకోవచ్చు అంటూ షణ్ముక్ తనదైన శైలిలో రిప్లై ఇవ్వటం గురువారం ఎపిసోడ్ కి హైలెట్. ఏది ఏమైనా మాత్రం ప్రస్తుతం హౌస్ లో షణ్ముఖ గ్యాంగ్ ని మిగతా 11 మంది సభ్యులు గట్టిగా టార్గెట్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఆరో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో ఈ ముగ్గురికి ఎక్కువగా ఓట్లు పడే అవకాశం ఉందని ఈ ముగ్గురు కచ్చితంగా ఎలిమినేషన్ కి నామినేట్ అవుతారని బయట జనాలు తాజా పరిస్థితిపై చర్చించుకుంటున్నారు.