ప్రస్తుతం టాలీవుడ్లో విజయ్ దేవరకొండకి క్రేజ్ మాములుగా లేదు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో చిన్న రోల్తో టాలీవుడ్కి పరిచయమైన విజయ్ దేవరకొండ ‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా హిట్ అయ్యాక ద్వారక, అర్జున్ రెడ్డి, టాక్సీవాలా సినిమాల్లో నటించాడు. మొదట టాక్సీవాలా సినిమా రిలీజ్ కావాల్సింది. కాకపోతే బడ్జెట్ ఎక్కువ కావడంతో సినిమాని విడుదల కాకుండా ఆపేశారు. ఆ సమయంలో ద్వారకా సినిమా రిలీజ్ అయి ఫ్లాప్ అయింది.
సేమ్ ఫార్ములా
దాంతో అందరూ విజయ్ హీరోగా ఏం పనికొస్తాడో ఏమో అనుకున్నారు. ఆ తర్వాత వచ్చిన గీత గోవింద సినిమా మంచి హిట్ అవడంతో మళ్లీ కాస్త నిలదొక్కుకున్నాడు. నెక్స్ట్ వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో కూడా మంచి హిట్ అందుకున్నాడు. ఆ రెండు సినిమాల్లో విజయ్ పూర్తిగా డిఫరెంట్ క్యారెక్టర్స్లో నటించాడు. రెండు సినిమాలు మంచి హిట్స్ని అందుకున్నాయి. అయితే అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్కి ఫుల్ క్రేజ్ వచ్చింది. ఇప్పటికి కూడా విజయ్ అదే ఆటిట్యూడ్ను మెయింటెన్ చేస్తూ సినిమాలు చేస్తున్నాడు. అర్జున్ రెడ్డి తర్వాత వచ్చిన నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలకి అదే ఫార్ములా ఫాలో అయ్యాడు. ఒకసారి చూసిన యాంగిల్ ని ఇంకోసారి చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడలేదు. దాంతో అర్జున్ రెడ్డి తర్వాత సేమ్ ఫార్ములాతో వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి.
భరించలేని విధంగా మారిన ఆటిట్యూడ్
అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా విజయ్కి చాలామంది హీరోయిన్లు ఫ్యాన్స్ అయిపోయారు. ప్రస్తుతం బాలీవుడ్లో విజయ్ దేవరకొండ పక్కన నటించడానికి చాలామంది హీరోయిన్లు వెయిట్ చేస్తున్నారు. తెలుగులో విజయ్ పక్కన రష్మిక, సమంత లాంటివారు నటించడానికి ఎంత ఉత్సాహంగా ఉన్నారో అంతకుమించి బాలీవుడ్ బ్యూటీలు ఎదురుచూస్తున్నారు. లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించిన అనన్య పాండే ఎన్నో ఆశలు పెట్టుకుంది. విజయ్ క్రేజ్ ని వాడుకొని తను కూడా మంచిగా సెటిల్ అవుదామనుకుంది. కానీ ఆమె ఊహించిందేమీ జరగలేదు. దాంతో అనన్య ఈ సినిమా అనవసరంగా చేశానని బాధపడుతుందట. ఈ సినిమా రిజల్ట్స్ చూసి అనన్యనే కాదు, విజయ్ అంటే పడిచచ్చే హీరోయిన్లందరూ ఇప్పుడు అతని పక్కన నటించడానికే ఆలోచిస్తున్నారు. ఇప్పటికైనా విజయ్ తన ఆటిట్యూడ్ను మార్చుకొని సేమ్ ఫార్ములా మళ్లీ రిపీట్ చేయకుండా మంచి కథను ఎంచుకుంటే బాగుంటుందని అందరూ సలహాలు ఇస్తున్నారు.