(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సోమవారం శాసనమండలి చైర్మన్ షరీఫ్ కలిశారు. ఎమ్మెల్సీలు శివనాధరెడ్డి, పోతుల సునీతలపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని స్పీకర్ షరీఫ్ను బుద్దా కోరారు.
తెలుగుదేశం పార్టీ శివనాధరెడ్డి, పోతుల సునీతలకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చింది. వారు ఇద్దరు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని కూడా కలిశారు. వారి అనర్హత పిటిషన్పై విచారణకు మండలి స్పీకర్ షరీఫ్ నోటీసులు ఇస్తుండగా ఎనిమిది నెలలుగా వారు ఎదో ఒక కారణం చెప్పి విచారణ నుండి తప్పించుకు తిరుగుతున్నారని బుద్దా వెంకన్న అన్నారు. వారిపై చైర్మన్ చర్యలు తీసుకోకముందే వారిద్ధరు నైతిక బాధ్యత వహించి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయాలని బుద్దా వెంకన్న కోరారు.
కాగా పోతుల సునీత అనర్హత పిటిషన్పై సోమవారం విచరణకు హజరు కావాల్సి ఉండగా ఆమె తరపున న్యాయవాది హజరై తన క్లయింట్ పోతుల సునీత తల్లి గారికి కరోనా సోకిందనీ, కావున కొంత సమయం కావాలని చైర్మన్ షరీఫ్ను కోరారు. దీంతో మండల చైర్మన్ షరీఫ్ విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు.