కొందరు దుండగులు ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ఫేక్ కాల్స్ చేస్తుండటం మనం తరచుగా చూస్తున్నాం. కొందరు ఆగంతకులు ఫోన్ చేసి మీ ఇంటి దగ్గర బాంబు పెట్టాం, మిమ్మలిని చంపేస్తాం అంటూ ఇటీవలి కాలంలో సెలబ్రిటీలకు ఫోన్లు చేసి వణికిస్తున్నరు. ఈ నేపథ్యంలో గతంలో తమిళ స్టార్ హీరోలు రజినీకాంత్, అజిత్, మరియు విజయ్ ఇళ్లలో బాంబులు పెట్టామంటూ వాళ్లని చంపేస్తాం అంటూ బెదిరింపు కాల్స్ రావడం, ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగి అవి ఫేక్ కాల్స్ అని నిర్దారించడం జరిగాయి.
తాజాగా ఇదే విషయం బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని లోనూ రిపీట్ అయ్యింది. ఈ ఫోన్ కాల్స్ తో అటు పోలీసులు ఇటు సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇటీవల దిశా పటాని తనకు గత కొన్ని రోజులుగా ఇటువంటి కాల్స్ వస్తున్నాయని, గుర్తుతెలియని వ్యక్తులు ఆ ఫోన్ కాల్స్లో నన్ను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చింది. వారు ఇలా బెదిరించడానికి వెనుక ఉన్న కారణాలు ఏమిటో కూడా తనకి అర్ధం కావట్లేదని ఆమె అంటోంది.
ఆ ఆగంతకులు కేవలం దిశా పటానికి మాత్రమే కాకుండా పలు పోలీస్ స్టేషన్లకు కూడా ఫోన్ చేసి దిశా పటానిని చంపేస్తామని, తనని ఎవ్వరూ కాపాడలేరని చెబుతున్నారట. దీంతో వెంటనే దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు మొదట ఈ కాల్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలుసుకున్నారు. అసలు ఈ కాల్స్ నిజమైనవేనా, లేక ఆమెను బెదిరించడానికి ఎవరైనా కావాలని ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారా అనే దానిపై పోలీసుల విచారణ జరుగుతోంది. తెలుగు ప్రేక్షకులకు ‘లోఫర్’ సినిమాతో పరిచయమయిన ఈ బ్యూటీ ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ అయ్యింది.