గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు గుర్తు తెలియని వ్యక్తుల నుండి మరో సారి బెదిరింపు మెసేజ్ లు వచ్చాయి. బెదిరింపు మెసేజ్ పై రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెదిరింపులకు భయపడేది లేదనీ, ధర్మం కోసం ప్రాణత్యాగానికి సిద్దమని ప్రకటించారు. రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాననీ, అది తనకు చాలని అన్నారు. తెలంగాణ యువత ఆశీర్వదిస్తే ధర్మం కోసం పారాడతానని స్పష్టం చేశారు. బెదిరింపు కాల్స్, మెసేజ్ లపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా డీజీపీ పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు రాజాసింగ్.

తాను ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకూ కనీసం ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదని మండిపడ్డారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ఎందుకు కట్టారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల ఫోన్ లు ట్రాకింగ్ చేయడానికి కట్టారా అంటూ ధ్వజమెత్తారు. ఎంఐఎంకు టెర్రరిస్టుల ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టే.. పోలీసులు పట్టించుకోవడం లేదని రాజాసింగ్ ఆరోపించారు. మళ్లీ మళ్లీ బెదిరింపు కాల్స్, మెసేజ్ లు వస్తున్నాయని ఇప్పటికైనా పోలీసులు స్పందించాలని కోరారు.
ఏపి నూతన గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ అబ్దుల్ నజీర్ .. విశేషం ఏమిటంటే..?