హైదరాబాద్: వైసిపిలో చేరిన దగ్గర నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ సినీ నటుడు మోహన్బాబు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
గత నెల 26న పలు నెంబర్ల నుండి ఫోన్ కాల్స్ వచ్చినట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రాథామిక విచారణ తరువాత ఆ కాల్స్ విదేశాల నుంచి వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు.
తదుపరి విచారణ నిమిత్తం న్యాయ సలహా కోసం సంప్రదింపులు జరుపుతున్నట్టుగా పోలీసులు వెల్లడించారు.
మోహన్బాబు ఇటివలే వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.