Earthquake: టర్కీ, సిరియాలో మరో సారి భారీ భూకంపం సంభవించింది. టర్కీలోని దక్షిణ హతాయ్ ప్రావిన్స్ లో రెండు సార్లు భూమి కంపించింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8.04 గంటలకు రిక్టర్ స్కేల్ పై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించగా, మూడు నిమిషాల తర్వాత రిక్టర్ స్కేల్ పై 5.8 తీవ్రతతో మరో సారి భూకంపం నమోదు అయ్యింది. ఢిఫ్నీ ప్రాంతానికి పది కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి మూడు అపార్ట్ మెంట్ లు కూలిపోయాయి. ముగ్గురు చనిపోయారు. మరో 200 మంది వరకు గాయపడ్డారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది.
రెండు వారాల క్రితమే టర్కీ, సిరియాలో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. వేల భవనాలు కుప్పకూలిపోగా, 47వేల మందికిపైగా మృత్యువాతపడ్డారు. వేల మంది గాయపడ్డారు. లక్షలాది మంది నిరాశ్రయులైయ్యారు. తాజాగా మరో సారి భూకంపం రావడంతో ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు. అయితే ఇప్పుడు భూకంపం వచ్చిన ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా నివసించడం లేదని అధికారులు పేర్కొన్నారు. గత భూకంపంలో కూలిపోయిన తమ ఇళ్ల నుండి సామాన్లు, వస్తువులు తీసుకొవడానికి వెళ్లి ఉంటారని చెప్పారు.
టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వంశీ అనుచరుల దాడి ..గన్నవరంలో హైటెన్షన్
#Turkey 🇹🇷#turkeyearthquake2023
New earthquakes in Turkey in the city of Hatay shook the south of the country. from 6.4, 6.2.
There were deaths as well as missing and thousands of wounded. It was announced that a new tsunami is coming in Iskenderum among others city.👇🏻 pic.twitter.com/vq5DROI1Vz— Daniel Von Sáenz ☭⃠🇵🇪🇯🇪🇩🇪➕️ (@DanielS12576850) February 21, 2023