సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం పల్వట్లలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కలుషిత ఆహారం కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కలుషిత ఆహారం తినడం వల్ల వీరు అస్వస్థతకు గురైనట్లు అధికారులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. జొన్న రొట్టేలు తిన్న అయిదుగురిలో ముగ్గురు మృతి చెందారు. జొన్నపిండిలో విష పదార్థం కలిసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతులు సుశీల(60), శ్రీశైలం(45), చంద్రమౌళి(55)గా గుర్తించారు. అనసూర్య (50), సరిత (40) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.