ప్రకాశం జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. బాపట్ల (ఉమ్మడి ప్రకాశం) జిల్లా ముండ్లమూరు మండలం ఈదర గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పోతిరెడ్డి పిచ్చిరెడ్డి (48), అలకుంట చిన రాములు (46), జెడా రామాంజమ్మ (30) లు బొప్పూడివారిపాలెం పొలాల్లో పశువులను మేపుకుని సాయంత్రం తిరిగి ఇళ్లకు బయలుదేరగా ఉరుములు మెరుపులతో వర్షం పడింది. వీరు ముగ్గురు గ్రామదేవత కాట్ల అంకమ్మ దేవాలయం సమీపంలోకి వచ్చే సరికి ఒక్కసారిగా పిడుగపడింది. పిడుగు పాటుకు వీరు ముగ్గురు విరుచుకుపడి అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయారు.
విషయం తెలియడంతో వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో ఈదల గ్రామంలో విషాదఛ్చాయలు అలుముకున్నాయి. రెవెన్యూ,. పోలీస్ వర్గాలు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఉన్నతాధికారులకు వివరాలను తెలియజేశారు.