కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కర్నూలు సమీపంలోని రింగ్ రోడ్డు వద్ద కారును ఢీకొట్టిన లారీ వేగంగా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురుని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు రుద్ర, గణేష్, సోమశేఖర్ లు రాయదుర్గం వాసులుగా పోలీసులు గుర్తించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి… ట్రాఫిక్ క్లియరెన్స్ చేశారు. ప్రమాదానికి కారణమైన లారీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శేషయ్య తెలిపారు.