భారత ప్రభుత్వం టిక్ టాక్ సహా 59 యాప్ లను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేయాలని టిక్ టాక్ యాజమాన్యం భావిస్తోంది. ఇందుకోసం న్యాయపోరాటానికి దిగనుంది.
అయితే మొదట్లోనే ఈ సంస్థకు ఇబ్బంది ఎదురైంది. తమ తరపున పిటీషన్ దాఖలు చేసి వాదించాలంటూ మాజీ అటర్నీ జనరల్ ముకుల్ రోహత్గిని ఆ సంస్థ కోరగా అందుకు ఆయన నిరాకరించారు.
తాను ఈ కేసును వాదించలేనని తెలిపి, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను ఈ పని చేయలేనని స్పష్టం చేసారు. దీంతో టిక్ టాక్ కు ఆదిలోనే ఇబ్బంది ఎదురైంది. మరి ఈ యాప్ తరపున వాదించడానికి ఎవరు ముందుకు వస్తారో చూడాలి.