భారత్ – చైనా సరిహద్దు తగాదాల కారణంగా ఆ ఎఫెక్ట్ టిక్ టాక్ పై పడింది. భారత్ లో టిక్ టాక్ ను బ్యాన్ చేసింది ప్రభుత్వం. దీంతో సంస్థ భారీ ఆదాయం కోల్పోయింది. టిక్ టిక్ అమెరికాలో కూడా బ్యాన్ అయ్యే స్థితిలో ఉంది. ఇందకు ప్రధాన కారణం టిక్ టాక్ చైనా కంపెనీ కావడమే. ఇండియాలో తగిలిన దెబ్బకే కుదేలైపోయిన టిక్ టాక్ అమెరికాలో కూడా బ్యాన్ అయితే కోలుకోవడం కష్టం అనే వార్తలు వస్తున్నాయి. పునరాలోచనలో పడ్డ టిక్ టాక్ యాజమాన్యం కొత్త ఆలోచనకు శ్రీకారం చుడుతోందని సమాచారం.
ఈ విపత్తు నుంచి గట్టెక్కడానికి యాజమాన్యం కొత్త ఆలోచన చేస్తోందట. చైనా కంపెనీలతో ఒప్పందాలు రద్దు చేసుకుని.. అమెరికా కంపెనీలతో టై-అప్ కావాలని ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. టిక్ టాక్ అమెరికా కంపెనీగా మారితే మళ్లీ తమకు పూర్వ వైభవం వస్తుందని ఆశిస్తున్నారు. టిక్ టాక్ చైనాకు చెందిన కమ్యూనిస్టుల ప్రభావంతో కస్టమర్ల డాటా చోరి చేస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా ల్యారీ కుడ్లోవ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
టిక్ టాక్ పూర్తి అమెరికా కంపెనీగా మారేందుకు ప్రయత్నాలు చేస్తోందనే సమాచారం తమ వద్ద ఉందని అంటున్నారు. ఇదే జరిగితే భారత్ లో కూడా టిక్ టాక్ కు మళ్లీ ఊపిరి పోసుకోవచ్చనే వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే టిక్ టాక్ ను అమెరికాలో బ్యాన్ చేయాలని ట్రంప్ కు అమెరికన్ కాంగ్రెస్ నుంచి ఒత్తిడి వస్తోందని అన్నారు.