చపాతీ లు వేడి,వేడి గా ఉన్నప్పుడు మాత్రమే మెత్తగా ఉండి కొద్దీ సమయం తర్వాత గట్టిగా అయిపోతున్నాయా? అయితే ఇలా చేసి చూడండి… చపాతీ పిండి ని కలిపే టప్పుడు అందులో కొంచెం పాలు పోసి కలిపి, చపాతీలు ఒత్తేటపుడు మాత్రం కాస్త నూనె రాసి, పొరలుగా వేసి మళ్లీ ఒత్తు కుంటే చపాతీలు చాలా సేపటివరకు మెత్తగా ఉంటాయి.
గుడ్డు పగలగొట్టి సోన తీసే ప్రయత్నం లో అందులో పెంకు లు పడితే అవితీయడానికి చాలా కష్ట పడవలసి వస్తుందా? అయితే చేతులు తడి చేసుకొని పెంకు తీసేందుకు ప్రయత్నించండి.పెంకు తియ్యడం ఇంత తేలిక అనుకుంటారు.
చాలామంది వెల్లుల్లిని కూరల్లో చిన్న చిన్న ముక్కలు గా చేసివేసుకుంటూ ఉంటారు. కానీ దీని బదులు పేస్ట్ చేసుకుని వేయడం వలన వెల్లుల్లి రుచి, వాసన ఆ వంటకానికి పడుతుంది.
నిమ్మ రసం చేసేటప్పుడు రసం తీసుకున్న తర్వాత దానితో పాటు నిమ్మ చెక్కలను కూడా రసం లో వేసి కాసేపు ఉంచడం వల్ల.. మంచి వాసనా, రుచి తో పాటు పోషకాలు కూడా బాగా అందుతాయి.
రైతా పులుపు లేకుండా కమ్మగా ఉండాలంటే ముందుగా పెరుగు లో ఉల్లి మరియు కూరగాయల ముక్కలు వేసుకుని, పక్కన పెట్టేసుకుని ఉప్పు మాత్రం ముందు వేయకుండా.. దాన్ని వడ్డించే ముందు కలుపుకోవడం వల్ల రైతా పుల్లగా అవ్వకుండా ఉంటుంది.
గుడ్లను ఉడకబెట్టాలనుకున్నప్పుడు ముందుగా నీటి లో అర చెంచా ఉప్పు వేసుకుని 4,5 చుక్కలు నూనె వేసి ఆ తర్వాత గుడ్లు నెమ్మదిగా అందులో వేసి ఉడికించుకోవడం వలన గుడ్లు పగలకుండా ఉడుకుతాయి.
వంట చేసేటప్పుడు గిన్నెలు మాడిపోతుంటాయి. వీటి మాడును వదిలించడానికి మాడిన గిన్నెలో ముందు కాస్త టీ పొడి,కొన్ని నీళ్లు పోసి కొంత సమయం పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత శుభ్రంచేసుకుంటే కొత్త వాటిలా మెరుస్తాయి.
కాచిన నెయ్యి మంచి వాసనా రావాలంటే నాలుగు మెంతులు వేసి ఉంచండి.
దోసల పిండి బాగాపులిసిపోయినప్పుడు కాస్త గోధుమ పిండిని కలిపితే పులుపు పోతుంది.. రుచిగాకూడా ఉంటాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?