తిరుమల తిరుపతి దేవస్థానం లోని ఎంతో మంది సిబ్బంది కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా తిరుమల దేవస్థానం కి చెందిన పెద్ద జీయర్ స్వామి కి కూడా కరోనా వైరస్ సోకినట్లు గా తేలింది.
ప్రస్తుతం అతను శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ వారి శ్రీ పద్మావతి స్టేట్ కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలే టిటిడిలో కరోనా విజృంభణ విషయమై మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు టిటిడి యాజమాన్యం మీద ఫైర్ అయిన విషయం తెలిసిందే.
ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద జీయర్ స్వామి కి కరోనా పాజిటివ్ రావడం టీటీడీ అధికారులపై ఒత్తిడి పెంచే విషయమే. ఈ నేపథ్యంలో దేవస్థానం లో దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలన్న వాదనలు వినబడుతున్నాయి.