Tirupathi By Poll: తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక కొనసాగుతుంది. ఓటింగ్ ప్రక్రియ మందకొడిగా జరుగుతుంది. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి తిరుపతి పార్లమెంట్ పరిధిలో 36 . 67 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం మందకొడిగా మొదలైన ఓటింగ్ ప్రక్రియ క్రమేణా ఊపందుకుంది. ఉదయం 9 గంటల సమయానికి 8 శాతం పోలింగ్ నమోదవ్వగా.., 11 గంటల సమయానికి 17 . 39 శాతం పోలింగ్ శాతం నమోదైంది. మధ్యాహ్న ఒంటిగంట సమయానికి నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే.. సర్వేపల్లిలో 38 . 10 శాతం.., గూడూరులో 36 . 84 శాతం.., సూళ్లూరుపేటలో 40 . 76 శాతం.., వెంకటగిరిలో 37 . 63 శాతం.., తిరుపతిలో 32 . 12 శాతం.., శ్రీకాళహస్తిలో 35 . 98 శాతం.., సత్యవేడులో 36 శాతం పోలింగ్ నమోదయింది.
* నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి 40 శాతం పోలింగ్ నమోదయింది.
Tirupathi By Poll: దొంగ ఓట్ల కలకలం..! ఈసీకి ఫిర్యాదులు..!!
మరోవైపు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో దొంగ ఓట్లు కలకలం రేపుతున్నాయి. వైసిపి వాళ్ళు ఎక్కువగా దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ సామజిక మాధ్యమాల్లో.. టీడీపీ అనుకూల మీడియాల్లో వరుసగా కథనాలు, వీడియోలు వస్తున్నాయి. అటు బీజేపీ, ఇటు టీడీపీ కూడా ఈ మేరకు ఎన్నికల కమీషన్ కి ఫిర్యాదులు చేశారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి, కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ సహా.., తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, బీజేపీ నేతలు, కాంగ్రెస్ నేతలు కూడా వైసిపి అక్రమాలపై ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో పోలీసుల తనిఖీలు ఎక్కువయ్యాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?