Tirupati by election : తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు గాను బిజెపి పార్టీకే ఆ సీటు ని కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రంలో జనసేన పార్టీలో ఉన్నప్పటికీ తమ పార్టీ అభ్యర్థినే జనసేన-బీజేపీ కూటమి నుండి పోటీ చేయాలని మోడీ టీం నిర్ణయించింది. ఇక ఈ విషయంపై జనసేన వారి రియాక్షన్ ఎలా ఉన్నప్పటికీ సోము వీర్రాజు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఏకంగా అభ్యర్థి పేరు ప్రకటించకుండానే ప్రచార కమిటీని ఏర్పాటు చేశారు. అందరికీ ఆర్డర్లు జారీ చేశారు. దీనిపై విమర్శలు ఎదుర్కొన్న వీర్రాజు చివరికి ఒక అభ్యర్థి పేరు ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
మాజీ ఐఏఎస్ కర్ణాటక చీఫ్ మాజీ సెక్రటరీ అయిన రత్నప్రభ భారతీయ జనతా పార్టీ తరపున తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 1981 ఐఏఎస్ ఆఫీసర్స్ బ్యాచ్ కు చెందిన రత్నప్రభ కర్ణాటక రాష్ట్రానికి మూడవ మహిళా చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. 2019 ఏప్రిల్ లో ఆమె భారతీయ జనతా పార్టీతో చేరారు. 2018 జూన్ లో ఆమె 36 ఏళ్ళ సర్వీస్ తర్వాత రిటైర్ అయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప గారి సమక్షంలో రత్నప్రభ బీజేపీ పార్టీలో చేరడం జరిగింది.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కి చుక్కలు చూపించిన రికార్డు ఆమెకు ఉంది. అడిషనల్ చీఫ్ సెక్రటరీగా ఆమె ఆ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది. రత్న ప్రభ దళిత మహిళ. ఎస్సీ ఎస్టీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించడంలో కూడా శాసనం ద్వారా రిజర్వేషన్లు రావడంలో ప్రముఖ పాత్ర పోషించింది. అంతేకాకుండా 1999, 2000 సంవత్సరంలో ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అమెరికన్ బయోగ్రాఫికల్ ఇన్స్టిట్యూట్ వారి నుండి అందుకుంది. హైదరాబాద్ కర్ణాటక రాష్ట్రాల్లో ఆమె బాగా పాపులర్. మరి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఎలా రాణిస్తుందో చూడాలి.