Tirupati by poll : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలకు ముందు విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఆయనకు పార్టీలో పెద్దపెద్ద నాయకులు లేకపోయినా…. మెగా ఫ్యామిలీ నుండి పెద్దగా స్టార్ సపోర్టు లేకపోయినా ఒక్కడే రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చేశాడు. అలాగే మొన్న స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కూడా సాధ్యమైనంత సపోర్ట్ ఇచ్చాడు. ఏకంగా వెళ్లి తెలంగాణాలో జరుగుతున్న ఎన్నికల్లో ఒక అభ్యర్థికి తమ మద్దతు ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో దాదాపు తన మనుషులని నిలబెట్టాడు. కానీ బిజెపి వల్ల వెనక్కి తగ్గాడు అనుకోండి అది వేరే విషయం…
ఇప్పుడు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక టికెట్టు చివరికి బీజేపీ వద్దకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని జనసేన అధికారికంగా ప్రకటించినప్పటికీ లోపల వారు మనస్థాపానికి గురి అయ్యారన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది అన్నది ప్రజల మాట. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో జనసేన బాగా జనబలం ఉన్న పార్టీ. భారతీయ జనతా పార్టీతో పోలిస్తే వంద రెట్లు మేలు. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తమ మిత్రపక్షమైన బిజెపి తిరుపతి లో పోటీ చేస్తుంటే అక్కడ వారికి మద్దతుగా ఉండమని తన కేడర్ కి ఎలాంటి పిలుపునీ ఇవ్వలేదు. వారి తరఫున ప్రచారం చేస్తానని కూడా ఎలాంటి వార్త లేదు.
సోము వీర్రాజు తాజాగా ఏర్పాటు చేసిన ప్రచార కమిటీ లో కూడా పవన్ ప్రస్తావన లేదు. అసలు షెడ్యూల్లో జనసేనానికి ప్లేస్ కూడా లేదు. మరి పవన్ తనకుతానే ఈ కార్యక్రమం నుండి తప్పకుండా…. లేదా భారతీయ జనతా పార్టీ వారే సపోర్టు వద్దనుకున్నారా అన్న విషయం పక్కన పెడితే… బీజేపీకి మాత్రం ఈ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువ. అసలు రెండో స్థానంలో నిలిచేందుకు కూడా వారు ఎంతో దూరంలో ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తి మద్దతు ఇస్తే ఒక నాలుగు ఓట్లు ఎక్కువ పోల్ అయి వారికి కాసింత గుర్తింపు వస్తుంది.
ఇక ఈ దిశగా వీర్రాజు అండ్ టీం ఆలోచిస్తారా…? లేదా పవన్ సినిమా షూటింగులో బిజీగా ఉండి పోయి ఈ తిరుపతి ఉపఎన్నిక విషయాన్ని మర్చిపోతారా? అన్నది చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?