అమరావతి: రాయలసీమకు హైకోర్టు తరలించడానికి బిజెపి మద్దతు ఇస్తుందని టుబాకో బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాధ్ బాబు అన్నారు. గుంటూరు జిల్లా పొన్నురులో శనివారం జరిగిన బిజెపి గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని తరలింపు అనేది పిచ్చి తుగ్లక్ ఆలోచన అవుతుందని అన్నారు. రాజధాని వికేంద్రీకరణ చేసుకోవచ్చునని ఆయన అన్నారు. రాష్ట్రంలో పాలన ఎలా ఉందో వైసిపి ఒక సారి ఆలోచన చేసుకోవాలని రఘునాధ్బాబు సూచించారు.
previous post
next post