REZINA: చైతన్యతో విడాకుల అనంతరం సామ్ తనకు నచ్చినట్టు లైఫ్ లీడ్ చేస్తోంది. ఎక్కువగా తనను తను ప్రశాంతంగా ఉంచుకునేందుకు టెంపుల్స్, పర్యాటక ప్రదేశాలను చుట్టి వస్తోంది. ఒంటరిగా కాకుండా ఎక్కువగా ఫ్రెండ్స్తో సమయాన్ని గడుపుతోంది. ఈ క్రమంలోనే సమంత పెయింటింగ్ చేస్తే బాధలు తొలగిపోతాయని ఆ మధ్య కొన్ని విషయాలు తన ఇన్స్టా గ్రామ్(instagram) వేదికగా చెప్పింది. కరోనా వలన ఎంతో మంది బాధకు గురయ్యారని, ఎన్నో రకాలుగా కష్టాలుపడ్డారని గుర్తుచేసింది. చాలా మంది తమ జీవితం మీద ఆశలు కోల్పోయారని వివరించింది. అలాంటి వారిలో మళ్లీ ఆత్మ స్థైర్యాన్ని నింపేందుకు ఇలా పెయింటింగ్, ఆర్ట్స్ వంటి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నట్టు పేర్కొంది. తనను ఎవరైనా ఇది నువ్వు చేయలేవని చెబితే వెంటనే చేసి చూపించేదాన్ని అని సామ్ సోషల్ మీడియా వేదికగా తెలిపింది.
SPB: మరణం తర్వాత పద్మ అవార్డుకు ఎంపికైన ఎస్పీబీ..
పెయింటింగ్తో బాధ నుంచి రిలీఫ్..
శ్రిష్టి ఆర్ట్స్ సంస్థ ఈ ప్రోగ్రామ్ను నిర్వహిస్తుండగా మనోహర్ చిలువేరు దానిని ముందుండి నడిపిస్తున్నారు. ఈ ఈవెంట్కు లక్ష్మీ నంబియార్ పలువురు సెలెబ్రిటీలను తీసుకెళ్తున్నారు. ఇప్పటికే సమంత(Samantha), ఆ తర్వాత మంచు లక్ష్మీ తన కూతురు విద్యతో కలిసి వచ్చి తమకు నచ్చినట్టు పెయింటింగ్ వేసి ఎంజాయ్ చేశారు.
Cholesterol: కొలెస్ట్రాల్ ఉల్లిపాయ తింటే తగ్గుతుందా..!?
బాధను పొగొట్టే నిపుణులు వారే..
తాజాగా సామ్ బాటను రెజీనా(REZINA) కూడా ఎంచుకున్నది. ఈ ముద్దుగుమ్మకు సామాజిక సేవా కార్యక్రమాలు అంటే చాలా ఇష్టమని మీ అందరికీ తెలిసిందే. ఒక మంచి పెయింటింగ్కు(painting) బాధను పోగొట్టే పవర్ ఉంటుందంటే.. చిత్రకారులు వాటిని పోగొట్టే నిపుణులు అవుతారు.
Samantha: పూజా హెగ్డే, రష్మిక మందన్నలను టార్గెట్ చేసిన సమంత..?
అందరూ తమ తమ బాధలను మరిచిపోయి యూనిటీగా ఉండేందుకు మనోహర్ చిలువేరు ఈ ఈవెంట్ను ఏర్పాటు చేశారు. లక్ష్మీ నంబియార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటూ రెజీనా చెప్పుకొచ్చింది. తనకు నచ్చినట్టు పెయింటింగ్ వేసి అలరించింది.