ఏ హీరోకైనా ఒక స్టార్ ఇమేజ్ వచ్చాక ఆ ఇమేజ్ ని కాపాడుకోవడమే పనిగా పెట్టుకొని అప్పటి నుంచి ఒక్కో సినిమాని ఎంతో జాగ్రత్తగా ఎంచుకుంటుంటాడు. ఒక్కసారి గనక స్టార్ స్టేటస్ నుంచి గ్రాఫ్ కిందకి జారితే అందరి అంచనాలు తారుమారవుతుంటాయి. ఇక సినిమా సినిమాకి అభిమానులని, ప్రేక్షకులని బ్యాలెన్స్ చేయడం .. వాళ్ళ అంచనాలని అందుకోవడం అంటే ఆ స్ట్రెస్ మాటల్లో చెప్పలేనిది. కాని ప్రభాస్ మాత్రం బాహుబలి తర్వాత పాన్ ఇండియన్ స్టార్ క్రేజ్ వచ్చినప్పటికి ఒకే స్ట్రాటజీని మేయింటైన్ చేస్తున్నాడు.
చెప్పాలంటే ప్రభాస్ కమిటయిన ప్రాజెక్ట్స్ భారీ బడ్జెట్ తో అయినప్పటికి ఆ స్ట్రెస్ మాత్రం తీసుకోవడం లేదని తెలుస్తోంది. చాలా కూల్ గా సినిమాలని కమిటవుతున్నాడు. అంతేకాదు ఒక్కో ప్రాజెక్ట్ కి కావల్సినన్ని డేట్స్ అడ్జెస్ట్ చేస్తూ దర్శక, నిర్మాతలకి సపోర్ట్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఒక్క రాధే శ్యామ్ సినిమా పక్కన పెడితే తాజాగా ప్రశాంత్ నీల్ తో కమిటయిన ” సలార్ ” తో కలిపి 3 భారీ ప్రాజెక్ట్స్ చేయబోతున్నాడు.
అయితే ఈ మూడు సినిమాల విషయంలో కొంత కంఫ్యూజన్ నెలకొందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు నాగ్ అశ్విన్ సినిమా ప్రకటించి ముందు ఆ సినిమా చేయాల్సిన ప్రభాస్ ఆ తర్వాత అనూహ్యంగా ఆదిపురుష్ ని ప్రకటించి .. ఇదే ముందు సెట్స్ మీదకి రాబోతుందని కన్ఫర్మేషన్ ఇచ్చారు. దాంతో ఎందుకు నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కంటే ముందే ఆదిపురుష్ చేస్తున్నాడు ప్రభాస్.. అంటూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు.
అయితే సలార్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసి ఇప్పుడు ఆదిపురుష్ కంటే ముందు సలార్ మొదలబోతుందని అంటున్నారు. ఇది ఫ్యాన్స్ తో పాటు చాలామందికి డైజెస్ట్ కావడం లేదు.. అలాగే ప్రభాస్ ప్లాన్ ఎంటో అర్థం కావడం లేదని చర్చలు జరుగుతున్నాయి. కాని ప్రభాస్ పక్కాగా ప్లాన్ చేసుకొని ఈ మూడు ప్రాజెక్ట్స్ ని ఒకే ఏడాది అంటే 2021 లో సెట్స్ మీదకి తీసుకు రాబోతున్నాడని సమాచారం. సలార్ మొదలైన 3 నెలలకి ఆదిపురుష్ తో పాటు నాగ్ అశ్విన్ సినిమాని సమాంతరంగా చేయబోతున్నాడట. ఇది చాలామందికి అర్థం కావడం లేదన్నది అసలు విషయం.