Kollywood: కోలీవుడ్.Kollywood దేశంలో బాగా పేరున్న చిత్ర పరిశ్రమల్లో తమిళ చిత్రసీమ ఒకటి. దక్షిణాదిన తెలుగు కంటే ఏడాది ముందే తమిళ సినిమా పురుడు పోసుకుంది. తర్వాత తెలుగు సినిమా వచ్చింది. అయినా.. దక్షిణాణ రెండు పరిశ్రమలు నువ్వా-నేనా అనేట్టుగా ఎదిగాయి. హీరోలు, స్టార్ హీరోలు, ఆరాధ్య దైవాలు రెండు పరిశ్రమల్లోనూ ఉన్నారు. అయితే.. తెలుగు హీరోలకు తమిళంలో పెద్దగా ఆదరణ ఉండదు. కానీ.. తమిళ హీరోలకు తెలుగులో కూడా స్టార్ ఇమేజ్ ఉండటంతో ఓ మెట్టుపైనే నిలుస్తున్నారు. తమిళ హీరోల సినిమాలు అక్కడా.. ఇక్కడా ఒకేరోజు రిలీజ్ అవడమే ఇందుకు నిదర్శనం. దీనిని నిజం చేస్తూ తెలుగు దర్శకులు తమిళ హీరోలతో సినిమాలు చేస్తున్నారు.
తమిళ స్టార్ హీరో విజయ్ తో వంశీ పైడిపల్లి ఓ సినిమా అనౌన్స్ చేశారు. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు. విజయ్ ప్రస్తుతం తన 65వ సినిమాగా బీస్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి సినిమా ఉండబోతోంది. శేఖర్ కమ్ముల తెలుగులో క్లాసిక్ డైరక్టర్ గా పేరు. కమ్మటి కాఫీలా ఆయన సినిమాలు ఉంటాయని పేరు. ప్రస్తుతం నాగచైతన్య-సాయి పల్లవితో లవ్ స్టోరీ తెరకెక్కిస్తున్నారు. దీని తర్వాత సినిమాగా తమిళ హీరో ధనుష్ తో సినిమా అనౌన్స్ చేసి సంచలనం రేపారు. పాన్ ఇండియా మూవీ అని అనౌన్స్ చేశారు. మరో స్టార్ హీరో సూర్యతో త్రివిక్రమ్ సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Read More: Liger: ‘లైగర్’ కు భారీ ఓటీటీ ఆఫర్..! ‘అంతేనా.. నేనైతేనా’ అంటున్న రౌడీ
విజయ్ సేతుపతి తమిళంలో విభిన్న పాత్రలు చేస్తున్నా హీరోగానూ విజయాలు ఉన్నాయి. సైరా.., ఉప్పెన సినిమాలతో తెలుగువారికి దగ్గరయ్యాడు. మళయాళ నటుడు, హీరో ఫహద్ ఫాజిల్ అక్కడ నవతరం సూపర్ స్టార్. ఆయన కూడా తెలుగులో పుష్ప ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇలా వీరంతా ఇప్పుడు తెలుగు తెరపై రాణించబోతున్నారు. డబ్బింగ్ సినిమాల ద్వారా వీరంతా తెలుగు ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్నారు. దీంతో తెలుగు స్ట్రెయిట్ సినిమా ఎప్పుడు? అనేక ప్రశ్నలు వారిక ఎదురవడంతో ఓ సినిమా చేస్తున్నారు. పూరి జగన్నాధ్ కూడా కన్నడ హీరో యశ్ తో సినిమా తీస్తాడనే టాక్ ఉంది. వీరంతా తెలుగు దర్శకులతోనే తెలుగు స్ట్రెయిట్ సినిమాల ద్వారా ఎంట్రీ ఇవ్వడం.. విశేషమే..!