Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్ కుమార్..ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలలో విభిన్నమైన పాత్రలను పోషిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకున్న నటి. శరత్కుమార్ నట వారసురాలుగా తమిళ చిత్ర పరిశ్రమలోకి 2012లో పోదా పోడి అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. అయితే కెరీర్ ప్రారంభం నుంచి కూడా వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్గానే అవకాశాలు కావాలని పట్టుపట్టలేదు. తనకి కథ, అందులో తన కోసం చెప్పిన పాత్ర నచ్చితే చాలు ఎలాంటి ఛాలెంజింగ్ రోల్ అయినా చేయడానికి రెడీ అయిపోయేది.
అదే నటిగా తనకంటూ సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడానికి కారణం అయింది. సాధారణంగా ఏ నటి అయినా హీరోయిన్గా స్టార్ హోదా దక్కించుకోవాలనే అటు మాతృ భాషలలో, ఇటు మిగతా సౌత్ భాషలలో విరివిగా ప్రయత్నాలు సాగిస్తుంటారు. అవసరమైతే మేకర్స్కి హీరోయిన్ అవకాశాలిస్తే రెమ్యునరేషన్ కూడా డిమాండ్ చేయమని ఆఫర్ ఇచ్చిన నటీ మణులున్నారు. కానీ వరలక్ష్మి శరత్ కుమార్ మాత్రం హీరోయిన్ పాత్రల మీదే ఫోకస్ పెట్టలేదు. లేడీ విలన్ పాత్రలు వచ్చిన, పోలీస్ పాత్రలు, రాజకీయ నాయకురాలి పాత్రలు వంటివి వచ్చినా సైన్ చేసింది.
Varalaxmi Sarathkumar : ఆమె నటన బావుందని ప్రత్యేకంగా అభినందించాడు.
ఇదే ఆమెకి టాలీవుడ్ వరకు తీసుకు వచ్చింది. ఎప్పటి నుంచో వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశం ఎదురు చూస్తూ వచ్చింది. అది మాస్ మహారాజ రవితేజ నటించిన క్రాక్ సినిమాతో కుదిరింది. తమిళంలో ధనుష్ నటించిన మారీ2 లాంటి సినిమాలలో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రలు చూసిన రవితేజ ఆమె నటన బావుందని ప్రత్యేకంగా అభినందించాడు. అలాగే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన నటించిన క్రాక్ సినిమాలో అవకాశం ఇచ్చారు.
ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ పోషించిన జయమ్మ పాత్ర అద్భుతంగా పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఆమెని అందరూ జయమ్మగానే పిలుస్తున్నారు. ఒకేసారి అటు క్రాక్ ఇటు అల్లరి నరేశ్ నటించిన నాంది సినిమాలతో తెలుగులో బాగా పాపులారిటీ సాధించుకుంది. ఇప్పుడు ఆమె కొన్ని సినిమాలలో పాత్రలకి కేరాఫ్ అడ్రస్గా మారారు. చెప్పాలంటే తెలుగులో నెగిటివ్ రోల్స్ అలాగే వెరైటీ పాత్రలకి వెర్సటైల్ యాక్ట్రెస్ వరలక్ష్మీ శరత్కుమార్ అయితే పర్ఫెక్ట్ అనే విధంగా పేరు తెచ్చుకొని మంచి అవకాశాలు దక్కించుకుంటోంది.
Varalaxmi Sarathkumar : బాలకృష్ణ 107లో వరలక్ష్మీ శరత్కుమార్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తోంది.
ప్రస్తుతం ఆమె తెలుగులో సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మించే సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తుందని సమాచారం. అలాగే మరోసారి క్రాక్ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఆయన 107లో వరలక్ష్మీ శరత్కుమార్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ చేసేందుకు ఆమె సైన్ కూడా చేసేసింది. అలాగే మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయట. అన్నీ కూడా బడా నిర్మాణ సంస్థల నుంచి వస్తున్న ఆఫర్సేనని తెలుస్తోంది. మొత్తానికి తమిళ, తెలుగులో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మీ శరత్కుమార్ వరుస ఆఫర్ అందుకుంటోంది. అలాగే ఆమె మలయాళంలో కూడా మంచి పాత్రలను చేస్తోంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!