రెబల్ స్టార్ ప్రభాస్ పైకి కనిపించరు కానీ.. ఆయన చాలామందికి సాయం చేస్తుంటారు. పబ్లిసిటీలంటే ప్రభాస్ కు నచ్చదు. ఇప్పటికే తన జిమ్ ట్రెయినర్ కు పెద్ద కారును గిఫ్ట్ గా ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు ప్రభాస్.
టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ చాలెంజ్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే కదా. గ్రీన్ చాలెంజ్ లో భాగంగా ప్రభాస్.. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఖాజీపల్లి అటవీ ప్రాంతం మొత్తాన్ని దత్తత తీసుకున్నారు. అక్కడ ఉన్న ఫారెస్ట్ బ్లాక్ ను ప్రభాస్ పరిశీలించారు.
ఖాజీపల్లి అటవీ ప్రాంతాన్ని అర్బన్ ఫారెస్ట్ పార్కుగా అభివృద్ధి చేయనున్నట్టు ప్రభాస్ తెలిపారు. ఈసందర్భంగా ఆయన బాహుబలి మొక్కలను నాటారు. దానితో పాటుగా.. ఓఆర్ఆర్ పక్కన రాబోతున్న మరో అర్బన్ ఫారెస్ట్ పార్కును తన తండ్రి పేరు మీద దత్తత తీసుకున్నారు.
ఈరెండు పార్కుల అభివృద్ధి కోసం ప్రభాస్ తక్షణమే రెండు కోట్ల రూపాయలను అధికారులకు అందించారు. దానితో పాటు అవసరాన్ని బట్టి మరింత డబ్బు ఇచ్చేందుకు ప్రభాస్ సంసిద్ధత వ్యక్తం చేశారు.
ఇప్పటికే గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా చాలామంది సెలబ్రటీలు మొక్కలు నాటడం.. మరికొంతమందిని నామినేట్ చేయడం మనం రోజూ చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ఈ చాలెంజ్ లో సినీ రంగానికి చెందిన వాళ్లు, రాజకీయ రంగానికి చెందిన వాళ్లు,. క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు మొక్కలు నాటిన సంగతి తెలిసిందే.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?