కరోనా సమయంలో ఓటిటి పుణ్యమా ఎంటర్టైన్మెంట్ కి కొదవ లేకుండా పోయింది. థియేటర్లు మూత పడినప్పటికీ సినిమాలు రిలీజ్ కాకపోయినా కూడా.. డిజిటల్ వేదికల ద్వారా బుల్లితెర హవా కొనసాగుతోంది. ఈ సమయంలో అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో.. ఓటిటి లే బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్ ఫామ్స్ గా నిలిచాయి. ఈ కొత్త ట్రెండ్ మొదలవడంతో తారల మైండ్ సెట్ కూడా మారిందని చెప్పాలి. లాక్ డౌన్ కారణంగా సినిమాలు కూడా లేకపోవడంతో వెబ్ సిరీస్ లలో నటించేందుకు స్టార్ హీరోయిన్లు బాగానే పోటీపడుతున్నారు.
ప్రేక్షకుల ఆదరణ కూడా ఉండటంతో ఈ బెస్ట్ అని ఫిక్స్ అవుతున్నారు. అంతేకాదు సినిమాలకంటే వెబ్ సిరీస్ లలో ఎక్కువగా పర్ఫార్మెన్స్ చేసే ఎన్నో ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ తో ప్రయోగం చేస్తున్నారు. ఇప్పటికే సమంత ఆహా సంస్థ ద్వారా ప్రత్యేక షో చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఫ్యామిలీ మాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ తో నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మరనుంది సామ్. ఈ వెబ్ సిరీస్ అతి త్వరలో అమెజాన్ ప్రైమ్ లో లాంచ్ కానుంది. దీంతో టాప్ సెలబ్రిటీలు సైతం తమ టాలెంట్ ను చూపించేందుకు ఓటిటి ల వైపు అడుగులేస్తున్నారు. లేటెస్ట్ గా మొన్నే పెళ్లి చేసుకుని హనీమూన్ హ్యాపీగా ఎంజాయ్ చేసిన కాజల్ అగర్వాల్ కూడా ఓటిటి బాట పడుతుంది.
మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఓటిటి లో ఎంట్రీ ఇవ్వబోతోంది. లైవ్ టెలికాస్ట్ అనే వెబ్ సిరీస్ తో కాజల్, లెవంథ్ అవర్, నవంబర్ స్టోరీ తో తమన్నా బుల్లితెరపై అలరించనున్నారు. ఈషా రెబ్బ కూడా లస్ట్ స్టోరీస్ తో ఎంటర్టైన్ చేయనుంది. మలయాళ ముద్దుగుమ్మ అమలాపాల్ కూడా అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇక రాధిక ఆప్టే ఇప్పటికే ఓటిటి స్టార్ గా చాలా పాపులర్ అయ్యింది. ఈ స్టార్ హీరోయిన్ల వరస చూస్తుంటే సినిమాలకు గుడ్ బై చెప్పి ఓటిటి లకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఒకరకంగా చూస్తే టాప్ హీరోయిన్స్ చుట్టూనే ఫేమస్ ఓటీటీలన్ని తిరుగుతున్నాయని అంటున్నారు.