తెలుగు చిత్ర పరిశ్రమలో అతి కొద్ది మంది హీరోయిన్లు మాత్రమే తమ నటన పరంగా ప్రేక్షకులను.. అభిమానులను సొంతం చేసుకుంటుంటారు. ఎక్స్పోజింగ్ చేయకపోయినా స్పెషల్ సాంగ్ లు చేయక పోయినా కేవలం క్యూట్ లుక్స్ తో అలరించే హీరోయిన్లు ఇండస్ట్రీలో ఉన్నారు. అలాంటి వారిలో మలయాళం కుట్టి సాయి పల్లవి ఫస్ట్ ప్లేస్ ని కైవసం చేసుకుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది సాయి పల్లవి. వరుసపెట్టి క్రేజీ ఆఫర్లు అమ్మడి చెంతకు వచ్చి చేరుతున్నాయి. అలా అని ఆషామాషీ సినిమాల్లో కాదు క్రేజీ ప్రాజెక్టుల్లో బంపర్ ఆఫర్లు కొట్టేస్తోంది సాయి పల్లవి.
ఇలా ఏకంగా ఐదు సినిమాల్లో నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది సాయి పల్లవి. యంగ్ స్టార్స్ నుంచి పవర్ స్టార్ వరకు … ఈ రౌడీ బేబీ జోడి కొడుతోంది. ఇప్పటికే లవ్ స్టోరీ లో నాగచైతన్య తో జోడీ కట్టింది సాయి పల్లవి. ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తయింది. న్యూ ఇయర్ లో లవ్ స్టోరీని రిలీజ్ చేసేందుకు దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఆరడుగుల ఆజానుబాహుడు రానా తో నూ జత కట్టింది సాయి పల్లవి. ఈ మూవీ కంప్లీట్ అయింది. ఈ రెండు సినిమాలు కూడా దాదాపుగా న్యూ ఇయర్ లోనే రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి.
ఈ సినిమా పైన ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక నానికి జోడీగా శ్యామ్ సింగరాయ్ లో కూడా నటించబోతోంది. అంతేకాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. మలయాళం మూవీ రీమేక్ లో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంద ని టాక్ వినిపిస్తూనే ఉంది. కానీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు లేటెస్ట్ గా మరో క్రేజీ ఆఫర్ ని సొంతం చేసుకుంది రౌడీ బేబీ. గోపీచంద్ తో జత కట్టేందుకు సిద్ధమవుతోంది. తేజ – గోపీచంద్ కాంబినేషన్లో రాబోతున్న అలిమేలుమంగా వెంకటరమణ ప్రాజెక్టులో హీరోయిన్ గా కన్ఫర్మ్ అయింది. పూజా హెగ్డే, రష్మిక కంటే ఎక్కువ సినిమాల్లోనే నటిస్తూ తన క్రేజ్ ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది.